తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు టి కృష్ణ తనయుడు గోపిచంద్. ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ ఆ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోవడంతో విలన్ గా టర్న్ తీసుకున్నాడు. ఆ సినిమాలు సూపర్ హిట్ కావడంతో మళ్లీ హీరోగా మారారు. ఆ తర్వాత వరుస విజయాలు అందుకున్న గోపిచంద్ మద్యలో అపజయాలతో సతమతమయ్యాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధి ప్రమోషన్ బిజీలో ఉన్నాడు గోపిచంద్. ఇండస్ట్రీలో మీకు, ప్రభాస్ కి మంచి స్నేహ సంబంధం ఉంది కదా.. మరి ఆయన చిత్రంలో విలన్ క్యారెక్టర్ వస్తే నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘ఒకవేళ ప్రభాస్ అడిగితే ఎలాంటి పాత్ర అయినా నటిస్తాను. తాను ప్రభాస్ కి మంచి స్నేహితుడిని.. అతని కోసం అవసరమైతే విలన్ పాత్రలో నటించమన్నా నటిస్తాను’ అని అన్నారు. ప్రస్తుతం గోపిచంద్ చెప్పిన సమాధానం సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘వర్షం’మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అందుకే మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు అయిన మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో గోపిచంద్ సరసన హీరోయిన్గా రాశీ ఖన్నా నటించింది. యూవీ క్రియేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్ని వాస్, వంశీ, ప్రమోద్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 26న జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా హాజరుకానున్నారు. ఈ సినిమా జులై 1న రిలీజ్ కాబోతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.