టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీకి విలక్షణ దర్శకుడు అనే పేరుంది. గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం, మురారి.. వంటి విభిన్న సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించారు కృష్ణవంశీ. 2017లో నక్షత్రం అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాని తర్వాత ఈయన మరో సినిమాను తెరకెక్కించలేదు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన చిత్రం ‘రంగ మార్తాండ’.మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి ఈ సినిమా రీమేక్. ఆగస్ట్లో రిలీజ్కి సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషకన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈయన తన కెరీర్లో జరిగిన పలు విషయాలపై ఓపెన్గా స్పందించారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత జీవితంలో రమ్యకృష్ణతో విభేదాలపై వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాక తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ.. ‘‘అసలు నాకు పెళ్లిపై ఆసక్తి లేదు. ముందునుంచి నేను పెళ్లికి దూరంగానే ఉండేవాడిని. పెళ్లి తర్వాత భార్య, పిల్లలు వారికి సంబంధించిన బాధ్యతలు మొదలవుతాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలని అనుకున్నాను. నేను పెళ్లికి సూట్ కానేమోనని భావించాను. నేను ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. అలాగని ఏకాకిలా బతకాలని అనుకోను. రాత్రి సమయంలో సినిమాలు చూస్తుంటాను. పగలు ఏదైనా పుస్తకం చదువుతుంటాను. నలుగురితో మాట్లాడటానికి కూడా ఎక్కువ ఇష్టపడను. బాధ్యతలంటే భయం. ఫ్రీ సోల్గా ఉండాలని అనుకున్నాను. కానీ చివరకు రమ్యకృష్ణతో పెళ్లి జరిగింది. అదంతా లైఫ్ డిజైన్ అనే ఇప్పటికీ భావిస్తాను’’ అని చెప్పుకొచ్చారు. ‘‘రమ్యకృష్ణతో పెళ్లి జరిగిన తర్వాత నా జీవితంలో కొత్తగా ఏం మారలేదు. నన్నేమీ ఆమె ఇబ్బంది పెట్టడం, ఇరుకున పెట్టడం వంటివి చేయలేదు. నన్ను నన్నుగా ఉండనిచ్చింది. తను తనుగా ఉంది. మా ఇద్దరిలోనూ పిల్లాడు పుట్టడం మినహా విపరీతమైన మార్పులేమీ రాలేదు’’ అని చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో తను డబ్బులు గురించి ఇబ్బందులు పడ్డానని, రమ్యకృష్ణతో గొడవలు అయ్యాననే విషయంపై కూడా కృష్ణవంశీ రియాక్ట్ అయ్యారు. ‘‘సెలబ్రిటీలు అయినప్పుడు ఇలాంటి వాటిని కొన్నింటిని ఫేస్ చేయక తప్పదు. అలాగని అందరూ నెగిటివ్గా ఆలోచించటం లేదుగా.. ఎవరో కొందరే అలా ఉన్నారు. అలాంటి వార్తలు గురించి విన్నప్పుడు ఓకే మాట్లాడుకోని అని నవ్వుకుంటాం. అందుకనే గాసిప్స్ను ఎప్పుడూ ఖండించాలని అనిపించలేదు. ఫీల్ కాలేదు.. అలా కూడా మాట్లాడుకుంటున్నారా అని ఆశ్చర్యపోతాం తప్పితే. ఏం మాట్లాడం’’ అన్నారు. అంటే తామిద్దరి మధ్య రిలేషన్ బాగానే ఉందని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Narasimha: నరసింహ మూవీలో సౌందర్య చెంపపై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్ వెనుక ఇంత కథ నడిచిందా? ఇది కూడా చదవండి: Bindu Madhavi: బిందు మాధవికి రమ్యకృష్ణ సపోర్ట్! వీరి రిలేషన్ ఏమిటంటే?