సిని పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. దాంతో ప్రతి ఒక్కరి చూపు ఇండస్ట్రీ పైనే ఉంటుంది. అయితే సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ గతంలో కొందరు హీరోయిన్స్ బాహాటంగానే ప్రకటించారు. ఈ క్రమంలో శ్రీరెడ్డి ఉదంతంతో ఒక్కసారిగా ఈ కాస్టింగ్ కౌచ్ అనే పదం పరిశ్రమలో మారుమ్రోగి పోయింది. తాజాగా ఓ డైరెక్టర్ సైతం దీని గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా నటి నీతూ చంద్ర చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో మనందరికి తెలిసిందే. అయితే నిత్యం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ.. సెలబ్రిటీలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.. డైరెక్టర్ గీతాకృష్ణ .. తాజాగా ఆయన కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. డైరెక్టర్ గీతాకృష్ణ మరిన్ని వివరాలు వెల్లడిస్తూ.. ''గత రెండు రోజుల క్రితం నటి నీతూ చంద్ర చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. ఈమె ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ప్రస్తుతం తనకి అవకాశాలు లేవని, అయితే ఓ వ్యాపారవేత్త నెలకు పాతిక లక్షలు జీతం ఇస్తాను భార్యగా ఉంటావా! అని అడిగారంటూ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. అలాగే సాక్షి చౌదరి గురించి కూడా కొన్ని విషయాలు తెలిపారు. వారికి నిజ జీవితంలో ఇలాంటి అనుభవం జరిగిందో? లేదో? తెలియదు కానీ ఈ విషయాలను పబ్లిక్ లో చెబుతూ వారి మార్కెట్ భారీగా పెంచుకుంటున్నారని'' ఈయన తెలిపారు.' వీరు ఆ వ్యాపారవేత్తలు చేసిన ఆఫర్ ని తిరస్కరించి నిశ్శబ్దంగా ఉండాలని సూచించాడు. ఇలాంటివన్ని ఇండస్ట్రీలో సర్వసాధారణమని' తెలిపారు. 'ఈ క్రమంలో పరిశ్రమకు చెందిన ఎంతో మంది హీరోయిన్స్ తరచూ దుబాయి వెళ్తూ ఉంటారని.. అక్కడ బడా వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకొని పిల్లల్ని కని జీవితంలో స్థిరపడిన వారు సైతం ఉన్నారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత తిరిగి ఇండియా వచ్చిన ఎంతో మంది సెలబ్రిటీలను కూడా తాను చూశానని' గీతాకృష్ణ తెలిపారు. ప్రస్తుతం డైరెక్టర్ గీతాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారయి. మరి ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Chiranjeevi: మెగా ఫ్యామిలీ పిక్ వైరల్.. ప్రత్యేకత ఏంటంటే? ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!