ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్లోనే కాక దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలో మామ పితా సాంగ్కు జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ఎంత పాపురల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాలకు కొరియోగ్రాఫర్గా పని చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే జానీ మాస్టర్కు బిగ్ స్క్రీన్ మీద కనిపించాలనే కోరిక. తాజాగా అది నెరవేరబోతుంది. ఆయన హీరోగా ఓ సినిమా ప్రారంభం అయ్యింది. జానీ మాస్టర్ హీరోగా ‘యథా రాజా తథా ప్రజా’ సినిమా ఆరంభమైంది. శ్రీనివాస్ విట్టల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ మరో హీరోగా, శ్రష్టి వర్మ నాయికగా నటిస్తున్నారు. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ఆరంభ మైంది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.. నా ఫెవరెట్ హీరో చిరంజీవి పుట్టిన రోజు నాడే నా సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాస్ చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఇక వికాస్తో నటించడం చాలా సంతోషంగా ఉంది. యథా రాజా తధా ప్రజా టైటిల్ చాలా బాగుంది. ఈ సినిమాకు తెలగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాకు పని చేస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్స్. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం అన్నాడు జానీ మాస్టర్. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. It's going to be a crazy new journey in #YathaRajaTathaPraja Need all your blessings @imVdeshK @verma_shrasti #SrinivasVittala #HareshPatel #OmMovieCreations #SriKrishnaMovieCreations @PulagamOfficial pic.twitter.com/sFIx6nEPdO — Jani Master (@AlwaysJani) August 22, 2022 ఇది కూడా చదవండి: జానీ మాస్టర్కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో ఇది కూడా చదవండి: వీడియో : విజయ్ దేవరకొండ కు రింగ్ తొడిగి ప్రపోజ్ చేసిన అమ్మాయి!