బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బిపాషాబసు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు సోషల్మీడియా వేదికగా ప్రకటించారు. భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి బేబీ బంప్తో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. "ఒక కొత్త సమయం, ఒక కొత్త దశ, ఒక కొత్త వెలుగుతో మా జీవితానికి ఇంకో భిన్నమైన కోణం యాడ్ కానుంది. ఇద్దరం వేర్వేరుగా జీవితాలు ప్రారంభించినా.. ఒకరినొకరం కలిసిన తర్వాత ఒకటయ్యాం. మరీ ఎక్కువ ప్రేమ మా ఇద్దరి మధ్యన ఉండడం అన్యాయం అనిపించింది. కాబట్టి త్వరలోనే ఇద్దరిగా ఉన్న మేము ముగ్గురం కాబోతున్నాం. మా ప్రేమ ద్వారా ఒక కొత్త సృష్టి, మా బేబీ త్వరలోనే మాతో కలవబోతోంది. మాపై చూపించిన ప్రేమ, ప్రార్ధనలు, శుభాకాంక్షలు అన్నీ ఎప్పటికీ మాలో భాగమే. మా ఇద్దరి జీవితాల్లోకి వచ్చి ఒక అందమైన జీవితాన్ని ఇస్తున్న బేబీకి కృతజ్ఞతలు.. దుర్గ దుర్గ" అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తల్లి కాబోతున్నందుకు బిపాసాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అజ్నాబీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బిపాషా.. తన రెండవ సినిమా తెలుగులో చేశారు. మహేష్ సరసన టక్కరిదొంగ సినిమాలో నటించారు. ఆ తర్వాత రాజ్, జిస్మ్ వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఈమె నటించిన ఆఖరి సినిమా ఎలోన్ 2015లో రిలీజైంది. ఈ మూవీ షూటింగ్లో ఉండగానే.. ఆ మూవీ హీరో కరణ్ సింగ్ గ్రోవర్తో ప్రేమలో పడ్డారు. 2016లో ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత తల్లి కాబోతున్న బిపాషాబసుపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. View this post on Instagram A post shared by bipashabasusinghgrover (@bipashabasu) ఇది కూడా చదవండి: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లైఫ్ లో ఇంత విషాదం ఉందా..? ఇది కూడా చదవండి: Kasturi Shankar: తులసికి అనుకోని ప్రమాదం! షాక్లో ప్రేక్షకులు!