సోను సూద్ కు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించాలని నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ లో కోరారు. కరోనా టైంలో ఎంతో సాయం చేస్తున్నారు సోను సూద్. స్టార్ హీరోలే చెయ్యలేని పనిని సోను సూద్ ఆస్తులు అమ్మి చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడో పంజాబ్ లోని మారుమూల ప్రదేశంలో పుట్టిన సోనూసూద్ నటన మీద ఆసక్తితో ముంబై చేరుకున్నాడు. కానీ ఆయనకు బాలీవుడ్ అవకాశాలు కంటే ముందే తమిళ, తెలుగు బాషలలోనే అవకాశాలు దక్కాయి. సోనూ సూద్ ఇప్పుడు దేశంలో మోస్ట్ సేలబుల్ టాపిక్ అయ్యారు. సోనూసూద్ గత కొంతకాలంగా ప్రజలకు అనేక విధాలుగా సహాయపడుతున్న సంగతి తెలిసిందే. రియల్ విలన్ గా ఉన్న ఆయన ఇప్పుడు రియల్ హీరో గా మారిపోయారు. తాజాగా పద్మ అవార్డుల కోసం కేంద్రం జనాల నుంచి స్పందనను కోరింది. పద్మ అవార్డులకు ఎవరైనా అర్హులు ఉంటే పేర్లు సూచించండని ప్రకటించడంతో.. టాలీవుడ్ బ్రహ్మాజి ముందుకు వచ్చారు.సోనూ సూద్ కి పద్మ విభూషణ్ ఇవ్వండి.. ఇవ్వాలని కోరుకునే వారు రీట్వీట్ చేయండని సూచించారు. దానితో సోను సూద్ కి పద్మ విభూషణ్ ఇవ్వాలంటూ ఆయన ఫాన్స్ డిమాండ్ చేస్తున్నాడు. దానితో సోను సూద్ స్పందించారు. బ్రదర్.. 135 కోట్ల మంది భారతీయుల ప్రేమను పొందడమే గొప్ప అవార్డు. ఇప్పటికే నేను ఆ అవార్డును పొందాను. మీరు చూపించిన ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞుడినే.. అంటూ ట్వీట్ చేసాడు. #padmavibhushan for @SonuSood ..if u agree with me..pl retweet.. #padmavibhushsnforsonusood #respectsonu https://t.co/cqV4We9uX3 — Brahmaji (@actorbrahmaji) June 11, 2021