చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెనువెంటనే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సీనియర్ నటి అనన్య ఛటర్జీ కన్నుమూశారు. నివేదికల ప్రకారం, అనన్య ఛటర్జీ కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతోంది. దీంతో ఆసుపత్రిలో చేరిన ఆమె శుక్రవారం(ఆగస్టు 26) తుదిశ్వాస విడిచింది. ఛటర్జీ కుమారుడు దేబంజన్ కూడా నటుడే. 'జగత్ జననీ మా సరదా'లో స్వామి వివేకానందను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక అనన్య ఛటర్జీ ఆకస్మిక మరణవార్త బెంగాలీ సినీ ఇండస్ట్రీతో పాటు ఎంతోమంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నటీనటులు శ్రీలేఖ మిత్ర, జోయ్జిత్ బెనర్జీ, సౌమిలీ ఘోష్ బిస్వాస్, గాయకుడు జోజోతో పాటు పలువురు ఛటర్జీ మృతిపట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బెంగాలీ పరిశ్రమలో భాగమైన అనన్య ఛటర్జీ.. ‘సోనా రోడర్ గాన్’లో ప్రముఖ పాత్ర పోషించింది. అయితే.. ఛటర్జీ గతవారం కూడా షూటింగ్ ల;ఓ పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇంతలోనే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు నివేదికలు తెలిపాయి. గత రాత్రి పరిస్థితి విషమించడంతో ఆమె శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఛటర్జీ మరణవార్త బెంగాలీ ఆర్టిస్టులను షాక్ కి గురి చేసింది. ఇక అనన్య ఛటర్జీ కెరీర్ పరంగా సీరియల్స్ తో పటు పలు సినిమాలలో కూడా నటించింది. ఆమె నటించిన ‘పోరోబోర్తి సంబద్ దూపూర్ దూతొర్ పోరే’ అనే టెలి ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. Veteran artist Ananya Chatterjee passes away For more, read: https://t.co/MTdEfurNM2#ananyachatterjee #ananya #RIP pic.twitter.com/S4fjlv7m27 — ETimes TV (@ETimesTV) August 26, 2022