Rashmi Gautam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు, సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘రష్మీ గౌతమ్’. ఈమె జబర్థస్త్ షోతో యాంకర్గా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఛానల్తో సంబంధం లేకుండా షోలు చేస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తున్నారు. ఇక, రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. వివాదాలకు చాలా దూరంగా ఉంటూ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాజాగా, ఓ నెటిజన్ ఈ విషయంపై రష్మీ మీద సెటైర్ వేశాడు. సంజూ కపూర్ అనే ట్విటర్ ఖాతాదారుడు రష్మీ గురించి ‘‘ రష్మీ గౌతమ్.. నీతో అసలు గొడవే లేదు. ఎవరు ఎమన్నా పట్టించుకోవు. అసలు ఎవరికీ రిప్లై ఇవ్వవు, అసలు నీకు తెలుగే అర్థం కాదు’’ అంటూ సెటైర్ వేశాడు. దీనిపై రష్మీ స్పందించారు. తనకు తెలుగు వస్తుందని చెప్పటానికో ఏమో మరి ‘‘ పండగ చేస్కో’’ అంటూ సదరు నెటిజన్కు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, రష్మీ గౌతమ్కు జంతువులంటే ఎంతో ప్రేమ. తన కళ్లెదుట ఏదైనా జంతువుకు బాధ కలిగితే సహించలేరు. అందుకే జంతువులతో కఠినంగా ప్రవర్తించే వారిపై మండి పడుతుంటారు. వివాదాలకు ఎంత దూరంగా ఉన్నప్పటికి.. జంతువులను హింసించే వారి విషయంలో మాత్రం కఠినంగా ఉంటారు. మరి, నెటిజన్ సెటైర్పై రష్మీ గౌతమ్ స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Pandaga chesko https://t.co/ghsUxTCScK — rashmi gautam (@rashmigautam27) August 26, 2022 ఇవి కూడా చదవండి : Nitin: రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ!