ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజుల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్ తర్వాత దాదాపు పెద్ద నుండి చిన్న సినిమాల వరకు నెల, రెండు నెలల గ్యాప్ లోనే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతూ వచ్చాయి. అయితే.. ఇటీవలే ఓటిటిలో స్ట్రీమింగ్ కావాల్సిన సినిమాలకు.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత వ్యవధి పెంచినట్లుగా సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఓ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ హీరో నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'థ్యాంక్యూ'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఇక లవ్ అండ్ ఎమోషనల్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థలైన అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే.. సినిమా ప్రస్తుతం థియేట్రికల్ రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని సమాచారం. ఇక నాగచైతన్య ఇప్పుడు సోలో హిట్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మజిలీ తర్వాత లవ్ స్టోరీతో పరవాలేదనిపించాడు. బంగార్రాజు వచ్చేసరికి నాగార్జున లీడ్ రోల్ కాబట్టి ఆ హిట్ ఆయన ఖాతాలో పడింది. ఇదిలా ఉండగా.. థ్యాంక్యూ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. మరి థ్యాంక్యూ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.