చిత్ర పరిశ్రమలో నట వారుసులుగా ఎంట్రీ ఇస్తారు కొందరు హీరోలు. కొందరు నిలబడతారు.. మరికొందరు తడబడతారు. ఈ క్రమంలో అల్లు వారింటి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హీర్ అల్లు అర్జున్. తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్ లతో అభిమానులను సంపాదించుకున్నాడు. తాజగా అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. మరి ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్లో ఇండియా డే పరేడ్ నిర్వహించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రాబోతున్నారనే విషయాన్ని న్యూయార్క్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 21వ తేదీన జరిగే 40వ భారత దినోత్సవ గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్కి హీరో అల్లు అర్జున్ నాయకత్వం వహిస్తారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ అధ్యక్షులు కెన్నీ దేశాయ్ చెప్పారు. తమ అభిమాన హీరోకు అరుదైన గౌరవం దక్కడం పట్ల బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో 'అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన 'పుష్ప' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా పుష్ప2 చిత్రం రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ జరుగుతున్నాయి. బన్నీ కుటుంబంతో సహా ఆఫ్రికాలోని టాంజానియాలో షికారు చేస్తున్నాడు. హీరో అల్లు అర్జున్ కు ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Venu Swamy: నరేష్ అతని మూడో భార్య విడిపోతారని నాకు ముందే తెలుసు: వేణు స్వామి ఇదీ చదవండి: Rashmi Gautam: త్వరలో రష్మీ పెళ్లి..! స్వయంగా ప్రకటించిన స్టార్ యాంకర్!