Ala Vaikunthapurramuloo: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అగ్రదర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమాగా వచ్చి ఇండస్ట్రీ రికార్డులు సెట్ చేసింది 'అల వైకుంఠపురంలో'. 2020లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అయితే.. ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ తర్వాత స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది ఏమైనా ఉందంటే.. అది టబు, జయరామ్ లు నివసించే ఇల్లు. 'వైకుంఠపురం' పేరు కలిగిన ఈ విలాసవంతమైన భవనం.. సినిమాలో కీలకం కాగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే.. సినిమా చూసినవారంతా ఈ ఇల్లు ఎవరిదా? అని ఆరా తీసేందుకు ప్రయత్నించారు. చివరికి ఆ ఇల్లు ప్రముఖ టీవీ ఛానల్(NTV) అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి కూతురి(రచనా చౌదరి) అత్తగారి ఇల్లు అని సినీవర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో ఇల్లు ఎంతో కీలకం కావటంతో అంత గొప్పగా కనిపించే ఇంటి కోసం దర్శకుడు త్రివిక్రమ్ చాలాకాలం వెతికారట. కొద్దిరోజుల తర్వాత ఈ వైకుంఠపురం గురించి తెలిసి.. ఆ ఇంటిని చూసిన త్రివిక్రమ్ షూటింగ్ చేసేందుకు ఇంటి యజమానులను ఒప్పించి 20 రోజులపాటు ఆ ఇంటి పరిసరాల్లో షూటింగ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ టైంలోనే బన్నీ విలాసవంతమైన భవనానికి ముగ్ధుడైపోయాడట. ఆ తర్వాత అలాంటి అధునాతన వసతులతో ఓ భవంతి నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు మూవీ థ్యాంక్స్ మీట్ లో చెప్పడం జరిగింది. మరి ఈ వైకుంఠపురం ఇంటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.