తిరుమల కొండ అంటే పవిత్రమైన చోటు. సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు ఎవరొచ్చినా సరే పద్ధతిగా స్వామి వారిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదం పొందుతారు. అలా సెలబ్రిటీలు వచ్చిన ప్రతిసారి మీడియా వాళ్లు కవర్ చేస్తూ ఉంటారు. ఆ న్యూస్ కూడా వైరలవుతుంది. కానీ ఇప్పుడు ఓ నటి ఏకంగా కొండపై రచ్చ చేసింది. టికెట్ కోసం గొడవ గొడవ జరగడంతో పాటు ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ స్పందించాలని ఆమె కోరింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన అర్చన గౌతమ్, సోమవారం తిరుపతి దర్శనానికి వచ్చింది. ఈ క్రమంలోనే రూ.10,500 పెట్టి టికెట్ కొన్నాసరే టీటీడీ సిబ్బంది తనకు టికెట్ ఇవ్వాలేదని ఆరోపించింది. కౌంటర్ కి వెళ్తే తనతో దురుసుగా ప్రవర్తించారని కూడా చెప్పింది. ఈ మొత్తాన్ని వీడియోగా తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అంతకు ముందు ఈ విషయం మొత్తాన్ని సెల్ఫీ వీడియోలో చెబుతుండగా, సిబ్బంది ఫోన్ లాక్కోవాలని చూశారు. దీంతో తనని వదిలేయాలని ఏడుస్తూ గట్టిగా అరుస్తూ రచ్చ రచ్చ చేసింది. కాగా యూపీ హస్తినాపూర్ నుంచి ఎమ్మెల్యేగానూ పోటీ చేసిన అర్చన గౌతమ్ ఓడిపోయింది. ఇది కూడా చదవండి: TTD: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం.. టీటీడీ చరిత్రలో ఇదే అత్యధికం! भारत के हिंदू धर्म स्थल लूट का अड्डा बन चुके हैं धर्म के नाम पर तिरुपति बालाजी मैं महिलाओं के साथ अभद्रता करते,यह टीटीडी के कर्मचारी पर कार्यवाही होनी चाहिए । मैं आंध्र गवर्नमेंट से निवेदन करती हूं।ओर यह VIP दर्शन के नाम पर 10500 एक आदमी से लेते है । इसे लूटना बंद करो । @INCIndia pic.twitter.com/zABFlUi0yL — Archana Gautam (@archanagautamm) September 5, 2022