బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు శుభవార్త! ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయి కొలువుకు చక్కటి అవకాశం!! ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. 6,432 ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు పోటీ పడొచ్చు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. బ్యాంకింగ్ రంగంలో అద్భుతమైన కెరీర్ సొంతమవుతుంది. పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్స్/మేనేజ్మెంట్ ట్రైనీస్ మొత్తం పోస్టుల సంఖ్య: 6,432 బ్యాంకుల వారీగా ఖాళీలు: కెనరా బ్యాంక్: 2500, యూకో బ్యాంక్: 550, బ్యాంక్ ఆఫ్ ఇండియా: 535, పంజాబ్ నేషనల్ బ్యాంక్: 500, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: 253, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2094. అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 01.08.2022 నాటికి 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఆన్లైన్ టెస్ట్, మెయిన్ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ప్రిలిమినరీ ఆన్లైన్ టెస్ట్: ఎంపిక ప్రక్రియలో తొలి దశ అయిన ప్రిలిమినరీ ఆన్లైన్ టెస్ట్ మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ 30 ప్రశ్నలు–30 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం ప్రతి విభాగానికి 20 నిమిషాలు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్,హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రిలిమినరీ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్కు ఎంపిక చేస్తారు. మెయిన్ ఆన్లైన్ పరీక్ష: మెయిన్ పరీక్ష మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష ఉంటుంది. మిగతా 25 మార్కులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్కు సంబంధించి లెటర్ రైటింగ్, ఎస్సే ప్రశ్నలు ఉంటాయి. మెయిన్ ఆబ్జెక్టివ్ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 45 ప్రశ్నలు–60 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలు–40 మార్కులు, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. అభ్యర్థులు ప్రతి విభాగంలో కనీస కటాఫ్ స్కోర్ సాధించాల్సి ఉంటుంది. 100 మార్కులకు ఇంటర్వ్యూ: మెయిన్లో ప్రతిభ చూపిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. మెయిన్లో సాధించిన స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది. మెయిన్, ఇంటర్వ్యూ మార్కులకు 80:20 నిష్పత్తిలో వెయిటేజీ ఇచ్చి.. తుది జాబితా రూపొందిస్తారు. ఇంటర్వ్యూలో కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ /ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ముఖ్య సమాచారం: దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.08.2022 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.08.2022 ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది: అక్టోబరు 2022 ఆన్లైన్ మెయిన్ పరీక్ష: నవంబరు 2022 ఇంటర్వ్యూలు: జనవరి/ఫిబ్రవరి 2023 తుది నియామకాలు: ఏప్రిల్ 2023 పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.ibps.in ఇదీ చదవండి: HCL TechBee: ఇంటర్తో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తారు! ఇదీ చదవండి: Govt Scholarships: విద్యార్థులకు శుభవార్త.. రూ.13,500 వరకూ స్కాలర్షిప్..!