ప్రతీ ఆడపడుచు ఏడాది పొడవున ఎదురు చూసే పండే ఈ రాఖీ పౌర్ణమి. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచేదే ఈ పండుగ. అయితే తన సోదరులకు రాఖీ కట్టేందుకు పట్టలేని ఆనందంతో తన కుమారుడిని వెంటపెట్టుకుని ఆ తల్లి బైక్ పై వెళ్లింది. తన సోదరులకు రాఖీ కట్టి ఆనందంగా తిరిగి రావాలనుకుంది. అంతలోనే రోడ్డు ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తాజాగా విశాఖపట్నంలో వెలుగు చూసిన ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని సబ్బవరం మండలం పెదయాతపాలెం. ఇదే గ్రామానికి చెందిన శరగడం సత్యవతి (34) రాఖీ పండగను ఎంతో అనందంగా జరుపుకోవాలని అనుకుంది. అయితే ఇందులో భాగంగానే తన సొదరులకు రాఖీ కట్టేందుకని మునకపాకకు వెళ్లాలని తన కుమారుడు సుఖేష్ రామ్ ను వెంట పెట్టుకుని బైక్ పై బయలు దేరారు. ప్రయాణంలో భాగంగా దుడ్డుపాలెం జంక్షన్ కు రాగానే ఎదురుగా వస్తున్న భారీ ఇసుక లారీ వీరి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకొడుకు చెల్లాచెదురుగా పడిపోయారు. వెంటనే గమనించిన స్థానికులు వారి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సత్యవతి పుట్టింటి వారు, అత్తింటి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పండగపూట తల్లీకొడుకు మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: శ్మశానంలో మాయమైన మహిళ మృతదేహం.. దిమ్మతిరిగే విషయం ఏంటంటే?