కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కడూరు గ్రామంలో నివాసం ఉంటున్న మోహన్ రామ్.. ఉపాధి కోసం రాజస్థాన్ నుండి కడూరు వచ్చిన మంజుల అనే యువతిని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన 2 నెలల తర్వాత దంపతులిద్దరూ రాజస్థాన్ వెళ్లారు. అయితే పనులు ఉన్నాయని మోహన్ రామ్.. కడూరు వచ్చేశాడు. భార్య తర్వాత వస్తుందని అనుకున్నాడు. అయితే తన ఫోన్లకి, మెసేజ్ లకి స్పందించకపోవడంతో అనుమానం కలిగిన మోహన్ రామ్.. రాజస్థాన్ బయలుదేరాడు. అక్కడ స్థానికుల ద్వారా భార్య మంజుల.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్నాడు. హర్యానాలో పిప్లివాలా గ్రామానికి చెందిన ఓం ప్రకాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మోహన్ రామ్.. తనకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకున్నావ్, అది చెల్లదని మెసేజ్ లు పంపేవాడు. ఆ మెసేజ్ లు చూసిన ఓం ప్రకాష్.. ఇకపై ఫోన్ లు చేసినా, మెసేజ్ లు చేసినా చంపేస్తానంటూ బెదిరించాడు. అయినప్పటికి మోహన్ రామ్ తన భార్య కోసం మెసేజ్ లు పంపుతూనే ఉన్నాడు. దీంతో ఆగ్రహం చెందిన ఓం ప్రకాష్.. తన ఫ్రెండ్స్ ని వెంటబెట్టుకుని కారులో కడూరు వెళ్ళాడు. అక్కడ నిత్యావసర సరుకులు కొంటున్న మోహన్ రామ్ ను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించారు. కత్తితో పొడిచి చంపబోయారు. మోహన్ రామ్ కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి అడ్డుకోబోయారు. అయితే కారుని వేగంగా పోనివ్వడంతో మిస్ అయ్యారు. కానీ కొంతదూరం వెళ్లేసరికి కారు ఆగిపోవడంతో నిందితులు దొరికిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఓం ప్రకాష్, అతనికి సహకరించిన స్నేహితులు శైలేంద్ర, ప్రదీప్, దల్లారామ్, జితేంద్ర, శంకర్ పాటిల్, దినేష్ లను అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుండి కారును, హత్య చేసేందుకు తమతో తెచ్చుకున్న కత్తి, వికెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరి ఒక భర్త ఉండగా, మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆ మహిళపై, అలానే మొదటి భర్తను చంపాలనుకున్న రెండవ భర్తపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. ఇది కూడా చదవండి: యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ క్యాబ్ డ్రైవర్లు..