నేటికాలంలో కొందరు కేటుగాళ్లు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారు. ఈ ప్రేమ పేరుతో దారుణంగా మోసపోతున్న యువతులకు సంబంధించి..నిత్యం అనేక వార్తలు వస్తున్నాయి. అయిన కొందరు అమ్మాయిలు.. మాయగాళ్ల మాటల నమ్మి వారి ఉచ్చులో పడి జీవితాన్ని కోల్పోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఓ యువతి దారుణంగా మోసం చేశాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. నువ్వు లేకుంటే బతకనని నమ్మించాడు. దీంతో ఆ వ్యక్తి చెప్పిన మాయ మాటలు నమ్మిన యువతి.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినా కాదని బంగారం, నగదు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.. చివరకు సర్వం కోల్పోయింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గా అనే యువతి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేది. ఆ సమయంలో అక్కడే ఓ కంపెనీలో పనిచేస్తున్న కరీంనగర్ కు చెందిన ఫారూఖ్ అలీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న అతడు తనకు అప్పటికే పెళ్లై, పిల్లలు ఉన్న విషయాన్ని దాచాడు. ప్రేమిస్తున్నానని, ఆమె పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని చెప్పాడు. దుర్గకి అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి పెళ్లి సంబంధం చూశారు. అతడిని కాదని బంగారం, డబ్బులు తీసుకుని దుర్గ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఫారూఖ్ మతం మార్చుకోవడంతో పెళ్లి చేసుకుంది. దుర్గ తెచ్చిన డబ్బులను ఫారూఖ్ సొంతానికి వాడుకున్నాడు. ఈ క్రమంలో ఫారూఖ్కు పెళ్లయిన విషయం బయటపడింది. పిల్లలు కూడా ఉన్నట్లు తెలియడంతో నిలదీ సింది. చివరికి ఆమె కూడా సర్దుకుపోయింది. అయితే ఫారూఖ్తో పాటు అతని మొదటి భార్య దుర్గను వేధించడం మొదలు పెట్టారు. వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కానీ వారు పెద్దగా పట్టించుకోక పోవడంతో ఫారూఖ్ మరింత రెచ్చిపోయాడు. దుర్గను వదిలేసి, మొదటి భార్య, పిల్లలతోనే ఉంటున్నాడు. అతడి కోసం కరీంనగర్ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మంగళవారం అతని ఇంటి ఎదుట నిరసన తెలిపింది. మరి.. ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి.. యువతులను మోసం చేస్తున్న ఇలాంటి కేటుగాళ్ల ఆగడాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ట్రయాంగిల్ లవ్.. లా కాలేజ్లో ఘోరం.. క్లాస్లో అందరూ చూస్తుండగా.. ఇదీ చదవండి: స్నేహితురాలితో కలసి డ్యూటీకి వెళ్లి.. ఆ బాధని భరించలేకపోయింది!