ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రముఖులకు ఆకతాయిల నుంచి వేధింపులు పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ కు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురయ్యాయి. కొందరు ఇన్ స్టాగ్రామ్ ద్వారా నైనాను వేధింపులకు గురిచేశారు. అసభ్యకరమైన మెసేజ్ లతో హింసిస్తున్నారు. దీంతో నైనా జైశ్వాల్ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. తనను సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన సందేశాలతో కొందరు వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నైనా జైస్వాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం వేట మొదలుపెట్టామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. తెలంగాణకు చెందిన నైనా జైస్వాల్.. టేబుల్ టెన్నిస్ స్టార్ క్రీడాకారుల్లో ఒకరిగా పేరు సంపాదించుకుంది. జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్షిప్లలో నైనా పలు టైటిళ్లను గెలుచుకుంది. నైనా జైస్వాల్ కేవలం టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గానే కాదు.. బాల మేధావిగా కూడా గుర్తింపు పొందింది. ఎనిమిదో ఏటనే టెన్త్, పదో ఏట ఇంటర్మీడియట్ పూర్తి చేసి గుర్తింపు తెచ్చుకుంది.13వ ఏటే డిగ్రీ, 15 ఏట పీజీ పూర్తి చేసిన ఆమె 17వ ఏట నుంచే పీహెచ్డీ చేయడం ప్రారంభించారు. అంతేకాదు తన రెండు చేతులతోనూ ఏకధాటిగా రాయగలరు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు నైనా సొంతం. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: లెజెండ్స్ లీగ్ క్రికెట్కు భారత జట్టు రెడీ! వరల్డ్ టీమ్తో మ్యాచ్ ఎప్పుడంటే..? ఇదీ చదవండి: పంత్పై ఊర్వశి రౌతెలా సంచలన కామెంట్స్..! అతనో ‘కౌగర్ హంటర్’