రాఖీ పండగపూట తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు వెళ్లిన ఓ మహిళ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఇదిలా ఉంటే తాజాగా పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైతం ఓ మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా మధీరనగర్ కు చెందిన ప్రదీప్ కుమార్, సాత్విక భార్యాభర్తలు. వీరికి కుమారుడు సంకీర్త్(16), కూతురు ఉపాసన జన్మించారు. అయితే సంకీర్త్ గురువారం తన ఇద్దరి స్నేహితులతో కలిసి సుల్తానాబాద్ పని మీద బైక్ పై వెళ్లారు. ఇక కాట్నపల్లికి చేరుకోగానే వీరి బైక్ ని ట్రాలీవ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంకీర్త్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు స్నేహితులు తీవ్రగాయాలపాలయ్యారు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించి.. సంకీర్త్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సంకీర్త్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతని సోదరి ఉపాసన.. అన్నా.. నువ్వు వెళ్లిపోతే రాఖీ ఎవరికి కట్టాలి అంటూ ఏడుస్తున్న సీన్ ను చూసి స్థానికులు కంటడి పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషాద ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ఆటో డ్రైవర్ ప్రేమలో స్టేట్ టాప్ ర్యాంకర్! ఆరోజు రాత్రి..!