నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. డబ్బు కోసం వచ్చిన దొంగలు అన్యాయంగా ఓ దంపతులను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తె.. పడారుపల్లి సమీపంలోని అశోక్ నగర్ లో క్రిష్ణారావు (54), సునీత (45) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగి.. పెద్ద కుమారుడు విశాఖపట్నంలో ఉండగా, చిన్న కుమారుడు నెల్లూరులో ఉంటున్నాడు. అయితే దంపతులు మాత్రం అశోక్ నగర్ లోనే నివాసం ఉంటున్నారు. క్రిష్ణారావు స్థానికంగా హోటల్ ను నడిపిస్తూ రాత్రి 12 గంటల తర్వాత ఇంటికి వస్తుండేవాడు. అయితే వీరిది ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబం కావడంతో కొందరు వ్యక్తులు వీరి ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్లాన్ వేశారు. ప్లాన్ లో భాగంగానే శనివారం రాత్రి భార్య సునీత తిని నిద్రలోకి జారుకుంది. ఎలాగో భర్త వస్తాడు కదా అని తలుపులు పెట్టకుండా నిద్రపోయింది. ఇక రాత్రి ఇంట్లో సునీత ఒంటరిగా ఉందని తెలుసుకున్న దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం బెడ్ పై పడుకున్న సునీత తలపై బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తర్వాత బీరువాను పగలగొట్టి నగదు కోసం అంతా వెతికారు. ఎంతకు కూడా నగలు, డబ్బులు ఎక్కడ కనిపించలేదు. దీంతో అలసిపోయి వెనుదిరిగే సమయానికి బయట నుంచి భర్త క్రిష్ణారావు కనిపించాడు. దొంగలను చూసి క్రిష్ణారావు ఒక్కసారిగా అరుపులు, కేకలు వేశాడు. దీంతో అలెర్ట్ అయిన దొంగలు క్రిష్ణారావును సైతం కత్తితో గొంతు కోసం దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తెల్లవారుజామును ఇంటి పని మనిషి వచ్చి చూడగా భార్యాభర్తలు రక్తపు మడుగులో పడి విగతజీవులుగా ఉన్నారు. వెంటనే స్థానికులు అంతా చేరి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పిల్లి అరుస్తుందని యజమానిపై యువకుడి దారుణం!