అతనికి ఆ అమ్మాయి అంటే చచ్చేంత ప్రేమ. ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువురి తల్లిదండ్రులకు వీరి ప్రేమ విషయం తెలిసింది. అయినా సరే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని జీవితంతో ఆమెతోనే ఉండాలని కలల కన్నాడు. కానీ చివరికి వీరి పెళ్లికి యువతి పెద్దలు నిరాకరించడంతో ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే? అది నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం. ఇదే గ్రామానికి చెందిన గోలకుంట సాయి కుమార్(22) తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే సాయి కుమార్ ఇదే గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ యువతి సైతం సాయి కుమార్ తో తరుచు మాట్లాడేది. అలా కొన్ని రోజుల పాటు మాట్లాడుకున్న వీళ్లు చివరికి ప్రేమికులుగా మారిపోయారు. ఒకరిపై ఒకరు మనసులు పారేసుకుని పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. కొన్నాళ్లకి ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే వీరి ప్రేమ విషయం ఆ యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వీరి పెళ్లికి నిరాకరించారు. ప్రియుడితో పెళ్లికి తల్లిదండ్రులు కాదంటున్నారని ఆ యువతి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది. వెంటనే గమనించిన ఆ యువతి తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రియురాలు పురుగుల మందు తాగిందని తెలుసుకున్న ప్రియుడు సాయి కుమార్ తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాక సాయి కుమార్ సైతం పురుగుల మందు తాగాడు. గమనించిన అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా.. అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: భర్త దానికి ఒప్పుకోలేదని భార్య ఆత్మహత్య!