వాళ్లిద్దరూ ఇష్టపడి గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లైన కొంత కాలం పాటు భార్యాభర్తలు సంతోషంగా జీవించారు. కొన్నాళ్లకి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే వీరి కాపురం సాఫీగా సాగుతున్న క్రమంలోనే తన భార్య ప్రియుడితో లేచిపోయింది. దీంతో భార్య కనిపించకపోవడంతో భర్త తన భార్య ఫోటోను చేతబట్టి.. నా భార్య కనిపించిందా అంటూ పిచ్చోడిలా తిరుగుతన్నాడు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బిహార్ రాష్ట్రం గోపాల్ గంజ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొంతకాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భర్త తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. అయితే ఇటీవల భార్య.. మనం సరదాగా ముంబై వెళ్లి చూసొద్దామని భర్తకు చెప్పింది. భార్య కోరికను కాదనని భర్త సరేనంటూ పిల్లలతో పాటు దంపతులు ముంబై వెళ్లారు. ఇక అక్కడికి వెళ్లాక ఉన్నట్టుండి పిల్లలతో పాటు భార్య కనిపించకుండా పోయింది. వెంటనే ఖంగారు పడ్డ భర్త అటూ ఇటూ అంతా వెతికాడు. ఎక్కడా కూడా తన భార్య, పిల్లలు ఆచూకి దొరకలేదు. ఏం చేయాలో తెలియక తన వద్ద ఉన్న భార్యా పిల్లల ఫోటోను చేత పట్టుకుని గల్లీ గల్లీ తిరుగుతూ నా భార్యా కనిపించిందా అంటూ కనిపించిన ప్రతీ ఒక్కరిని అడుగుతున్నారు. ఇక భార్య, పిల్లల ఆచూకి దొరకొకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా ఆమె ప్రియుడితో లేచిపోయిందని తేల్చేశారు. దీంతో భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భర్త ఆమెను విడిచి ఉండడం నా వల్ల కాదనుకున్నాడు. అయినా సరే, నా భార్య నా వద్దకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తానంటూ తన భార్యా పిల్లలతో కూడిన ఫోటోను పట్టుకుని వెతుకుతున్నాడు. ఆ వ్యక్తి బాధను చూసిన కొందరు వ్యక్తులు కన్నీరు పెడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ఎన్నో ఆశలతో హాస్టల్ లో జాయిన్ అయ్యింది. కానీ.., ఊహించని విధంగా!