ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకుని పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. సమాజం అంగీకరించకపోయినా కలిసి జీవించాలనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. వీరి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఒకే తాడుతో ఉరేసుకుని ప్రాణాలు వదిలి జీవితాన్ని ముగించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటన హైదరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ కు చెందిన రవి, అనూష అనే ఇద్దరు కుటుంబాలు గత కొంత కాలం నుంచి మైలార్ దేవ్ పల్లి పరిధిలోని నేతాజీనగర్ లో నివాసం ఉంటున్నారు. రవి స్థానికంగా ఆటో నడుపుతుండగా, అనూష ఇటీవలే ఇంటర్ పూర్తి చేసి 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. అయితే వీరిద్దరి ఇళ్లు పక్క పక్కనే ఉండడంతో ఒకరికొకరికి పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం చివరికి ప్రేమగా వరకు వెళ్లింది. ఒకరినొకరు ఇష్టపడి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే వీరి ప్రేమ వ్యవహారం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. అనూషను మందలించి రవి కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. ఈ కారణంతోనే రవి కుటుంబం అంతా అక్కడి నుంచి మకాం మార్చి మరో చోట నివాసం ఉంటున్నారు. అయితే రవి ఇటీవల తన తల్లితో పాటు నేతాజీ నగర్ లో ఉన్న పాత ఇంటికి వచ్చారు. ఇక ఆ రోజు రాత్రి రవి తన ప్రియురాలైన అనూషను తన ఇంటికి పిలిపించుకున్నాడు. కలిసి జీవించలేనప్పుడు ఈ బతుకెందుకనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఒకే తాడుకు ఉరి వేసుకుని ప్రాణాలు వదిలారు. ఈ సీన్ ను చూసిన ఇరువురి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: మేన బావను ప్రేమించింది.. కానీ బావ ఇలా చేసేసరికి!