ఈ మద్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ శాతం నేరాలకు కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వేద మంత్రాల సాక్షిగా.. పెద్దల దీవెనలతో ఒక్కటైన జంట ఒక్క ఏడాదిలోనే విడిపోతున్నారు. కొంతమంది వివాహేతర సంబంధాలతో ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. సొంత వాళ్లనూ హతమార్చేందుకు వెనుకాడటం లేదు. తప్పు అని తెలిసినప్పటికీ వివాహేతర సంబంధాల మాయలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఓ మహిళ భర్త, పిల్లలతో సంతోషంగా ఉండాల్సింది పోయి.. పరాయి వ్యక్తుల మోజులో పడి.. తన భర్త, పిల్లల చావుకు కారణం అయ్యింది. ఈ విషాదం కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నాటక.. తుమకూరులో సమీవుల్లా భార్య సాహెరా బాను చిన్న చిన్న పనులు చేసుకొని జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. నాలుగు సంవత్సరాల క్రితం భార్యాభర్తల మద్య గొడవ జరగడంతో సాహెరా తన ప్రియుడితో కలిసి దుబాయ్ కి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తన పిల్లలతో వీడియో కాల్స్ లో మాట్లాడుతూ.. భర్త లైన్లోకి వస్తే వెకిలి మాటలు మాట్లాడుతూ హేళన చేసేది. తన భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోవడమే కాదు తనను మానసికంగా వేధిస్తూ ఉండటం సమీవుల్లా భరించలేకపోయాడు. ఈ క్రమంలో ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. గురువారం ఉదయం ముగ్గురు పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను కూడా సేవించాడు. కొంతసేపటికే సమీవుల్లా చనిపోయాడు. కొస ప్రాణాలతో పిల్లలు కొట్టుమిట్టాడుతుంటే.. స్థానికులు బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇది చదవండి: విషాదంగా ముగిసిన ఫేస్ బుక్ ప్రేమ.. అసలేం జరిగిందంటే? ఇది చదవండి: దారుణం.. భర్తపై కోపంతో టీలో విషం కలిపి ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసిన తల్లి!