కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. ఓ భర్త క్షణికావేశంలో భార్యను గన్ తో కాల్చి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. కొడగు జిల్లా సోమవారిపేట పరిధిలోని బెట్టళ్లి. ఇదే గ్రామంలో గోపాల్, చస్మా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఎలాంటి విభేదాలు లేకుండా సంతోషంగా జీవించారు. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి భార్యాభర్తల నడుమ వివాదం నడుస్తుంది. అనేక సార్లు పెద్దలు సైతం తలదూర్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కాగా ఇటీవల మరోసారి భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త కిషన్ క్షణికావేశంలో భార్యను గన్ తో కాల్చి చంపాడు. ఈ దాడిలో భార్య చస్మా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే భర్త ఈ హత్యకు పూనుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కట్టలు తెంచుకున్న కోపంతో విర్రవీగి భార్యను గన్ తో కాల్చి చంపిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: వంట నూనే అనుకుని పురుగుల మందుతో వంట.. తర్వాత ఏం జరిగిందంటే?