ఎంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కొందరు మాస్టారులు మచ్చ తెస్తున్నారు. నేటి తరం పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చుదిద్దాల్సిన ఉపాధ్యాయులే పక్కదారుల్లో పయనిస్తూ బరితెగించి ప్రవర్తిస్తున్నారు. సరిగ్గా ఇలాగే ప్రవర్తించిన ఓ మాస్టారు తప్పతాగి ఏకంగా స్కూల్ కు వచ్చాడు. రావడమే కాకుండా స్కూల్ వరాండాలో పడుకుని దొర్లుతూ పాటలు పాడుతూ నానా హంగామ చేశాడు. దీనిని చూసిన విద్యార్థులు మాస్టారు ఏంటీ ఇలా తయారయ్యారు అంటూ అసహ్యించుకున్నారు. తాజాగా ఝార్ఖండ్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్ దుమ్కాలో షికారిపాడు బ్లాక్ లోని దర్బార్ పూర్ స్కూల్ లో ఆండ్రియాస్ మరాండి అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇతనికి మద్యం తాగే అలవాటు ఉంది. అయితే గురువారం ఫుల్ గా మద్యం సేవించి స్కూల్ కు వచ్చాడు. రావడమే కాకుండా నేలపై పడుకుని దొర్లుతూ, పాటలు పాడుతూ నానా హంగామా చేశారు. నేను మద్యం మాత్రమే తాగానని, ఎలాంటి దొంగతనం చేయలేదని తెలిపాడు. మాస్టారు తీరు చూసి పిల్లలు తెగ నవ్వుకుంటే.., స్థానికులు మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు. మాస్టారు నిర్వాకంపై కొందరు యువకులు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో కాస్త వైరల్ గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన అధికారులు అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఇతగాడు ఇలా తాగి స్కూల్ కు రావడం ఇదే మొదటి సారి కాదట. ఇలా అనేక సార్లు తాగి స్కూల్ కు వచ్చిన రోజులుగా కూడా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. తప్పతాగి స్కూల్ కు వచ్చిన మాస్టారు తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడాచదవండి: భార్యను గన్తో కాల్చి చంపిన భర్త.. ఎందుకో తెలుసా?