కొందరు మహిళలు పెళ్లై పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నా కూడా పరాయి సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. లేటు వయసులోనూ తమ కోరికలను పరాయి వాళ్లతో తీర్చుకునేందుకు కట్టుకున్న వాళ్లను సైతం పక్కనపెడుతున్నారు. ఇలా ఓ తల్లి పరాయి మగాడితో ఏకాంతంగా కలిసి ఉంటూ కొడుకు కంట పడింది. కట్టలు తెంచుకునే కోపంతో రగిలిపోయిన కుమారుడు ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా హర్యానాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది హర్యానా రాష్ట్రంలోని సోనేపట్ పరిధిలోని జట్వాడ మోహన్లాల్ ప్రాంతం. సోనాదేవి అనే మహిళకు పెళ్లై పెళ్లీడుకొచ్చిన కుమారుడు కూడా ఉన్నాడు. సోనాదేవి స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో వార్డన్ గా పని చేస్తుంది. ఇక ఆ మహిళ స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈ విషయం కొన్ని రోజుల తర్వాత తన కొడుకుకు తెలిసింది. ఏం చేయాలని ఆలోచిస్తున్న క్రమంలోనే తల్లి మరోసారి ఏకంగా ఇంట్లోనే ప్రియుడితోనే ఏకాంతంగా కనిపించింది. కోపంతో ఊగిపోయిన ఆమె కుమారుడు ఇంట్లో ఉన్న కత్తితో తల్లిపై దాడి చేసి హత్య చేశాడు. కుమారుడి దాడిలో తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం తల్లి శవాన్ని ఓ సంచిలో మూట కట్టి మంచం కింద ఉంచాడు. అలా రెండు మూడు రోజులు గడిచాక వారి ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. ఏం జరిగిందని చుట్టుపక్కల వాళ్లంత ఇంట్లోకి వచ్చి చూడగా మంచం కింద సంచిలో శవం కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ఇద్దరు యువకులతో ప్రేమ, మరో యువకుడితో పెళ్లి.. చివరికి ట్విస్ట్ ఏంటంటే?