Crime News: భోజనం వడ్డించే విషయంలో గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. కట్టుకున్న భర్తే భార్యను కడతేడ్చాడు. ఈ సంఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్కు చెందిన దీపక్ ఖిరబత్, పూనమ్ అరోరాలు అక్కడి సూర్య విహార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. పూనమ్ మానసిక స్థితి సరిగా లేదు. కొద్దిరోజుల క్రితమే ఆరోగ్యం కొంత కుదుటపడింది. బుధవారం దీపక్, పూనమ్ను పిలిచి తనకు భోజనం వడ్డించమని అడిగాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. గొడవ సందర్బంగా దీపక్, పూనమ్ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, తల్లి మరణ వార్త తెలిసి కూతురు మన్యతా అక్కడికి వచ్చింది. పోలీసులకు తల్లి మరణంపై అనుమానం ఉందని ఫిర్యాదు చేసింది. తమ ఇంట్లో అద్దెకు ఉండే వాళ్లు మంచి వాళ్లు కాదని, తనను చంపేస్తారని తల్లి చెబుతూ ఉండేదని ఆమె తెలిపింది. మన్యతా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో అద్దెకు ఉన్న వారిని విచారించారు. కానీ, లాభం లేకపోయింది. పూనమ్ పోస్టుమార్టం రిపోర్టులో గొంతుపై గోళ్ల ఆనవాళ్లు కనిపించాయి. దీంతో దీపక్ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీపక్ జరిగిందంతా పోలీసులకు చెప్పాడు. భోజనం వడ్డించే విషయంలో గొడవ కారణంగా భార్యను చంపేసినట్లు తెలిపాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : కసాయి మహిళ కిరాతకం.. రెండేళ్ల పసిబిడ్డను ముక్కలుగా చేసి!