చుట్టుముడుతున్న మానసిక ఒత్తిళ్ల కారణంగా నేటి కాలంలో చాలా మంది క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భర్త సినిమాకు తీసుకెళ్లలేదని, కొత్త చీర కొనివ్వలేదని, తండ్రి మందలించాడని ఇలా కారణాలు ఏవైన చివరికి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఇటీవల జాతీయ నేర గణాంక సంస్థ సైతం వెల్లడించడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా భర్త తాను చెప్పిన మతం స్వీకరించలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అది ఏపీలోని ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి. ఇదే గ్రామంలో అనిల్ కుమార్, పావని(31) అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. భర్త స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే పావని పెళ్లికి ముందు తల్లి దండ్రులతో పాటు ఓ మతాన్ని స్వీకరించి దేవుడి ప్రార్థనకు వెళ్లేది. ఇక కొంత కాలానికి పావనికి పెళ్లి చేయడంతో భర్తను కూడా అదే మతంలోకి తీసుకొచ్చేందుకు అనేక సార్లు ప్రయత్నించింది. కానీ భర్త దానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆగస్టు 29న పావని తనకు నచ్చిన మతానికి సంబంధించిన దేవుడి ఫోటోను తన ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకుంది. ఇది చూసిన భర్త ఆ దేవుడి ఫోటోను తొలగించాడు.ఇక కోపంతో ఊగిపోయిన భార్య.. ఎందుకు ఇలా చేశావంటూ భర్తతో వాగ్వాదానికి దిగింది. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఈ క్రమంలోనే పావని తీవ్ర మనస్థాపానికి గుర ఊహించని నిర్ణయం తీసుకుంది. భర్త తాను చెప్పిన మతాన్ని స్వీకరించకపోగా, నాకు నచ్చిన దేవుడి ఫోటోను సైతం తొలగించాడనే కారణంతో ఇటీవల ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న పావని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషా ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: కొడుకు పుట్టలేదని బరితెగించిన తల్లి! కన్న కూతుళ్లు అని చూడకుండా!