పిల్లలు అంటే ఎటువంటి కల్మషం లేకుండా తోటి వారితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొందరు పిల్లలు మాత్రం దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొందరు ముఠాలు పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మరీ దొంగతనాలు చేయిస్తున్నారు. దీంతో పోలీసులకు కూడా చిక్కకుండా మైనర్ పిల్లలు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ 8 ఏళ్ల బాలుడు 30 సెకన్లలో రూ.35 లక్షలు దొంగతనం చేశాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని పాటియాలా పట్టణంలోని కాళీదేవి ఆలయం సమీపంలో ప్రముఖ బ్యాంక్ ఉంది. ఏటీఎం మెషిన్ లో నింపేందుకు రూ.35 లక్షలను ఓ బ్యాగ్ లో పెట్టి ఐదో నెంబర్ కౌంటర్ వద్ద ఉంచారు బ్యాంక్ సిబ్బంది. సుమారు ఉదయం 12.30 గంటల సమయంలో ఓ 8 ఏళ్ల బాలుడు బ్యాంకు లోకి మరో వ్యక్తితో కలసి ప్రవేశించాడు. వారిద్దరు బ్యాంకు మొత్తాన్ని 20 నిమిషాల పాటు పరిశీలించారు. ఆ తర్వాత నగదు బ్యాగ్ ఉంచిన ఐదో నంబర్ కౌంటర్ దగ్గరకు బాలుడు వెళ్లాడు. బాలుడిపై ఎవరికి అనుమానం రాలేదు. దీంతో బాలుడు కేవలం 30 సెకన్లలోపే రూ.35 లక్షలు ఉన్న బ్యాగ్ తీసుకుని బయటకు పారిపోయాడు. ఈ దొంగతనం అంతా సీసీటీవీ కెమెరాల్లో ఇది రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సీసీ టీవీని పరిశీలీంచారు. బ్యాంకు అధికారులను నుంచి వివరాలు సేకరించారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ దొంగతనం జరిగిందని ఎస్పీ వజీర్ సింగ్ తెలిపారు. ఈ వ్యవహారం వెనుక బ్యాంకు సిబ్బంది సహకారం ఉండొచ్చన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 8 ఏళ్ల బాలుడు చేసిన ఈ దొంగతనంపై నెటిజన్ల నుంచి కూడా భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి. ఇదీ చదవండి: ఏయూ విద్యార్థిని ఛరిష్మా కృష్ణకు మిస్ సౌత్ ఇండియా కిరీటం ఇదీ చదవండి: యంగెస్ట్ సీఈవో..13 ఏళ్లకే 56 కంపెనీలకు బాస్!