నేటి కాలంలో అమ్మాయి పుట్టాలని కొంతమందే కోరుకుంటుంటే.. అబ్బాయి పుట్టాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇంతటితో ఆగకుండా కనిపించిన దేవుడికల్లా మొక్కుతు పూజలు చేస్తున్నారు. రాబోయే తరాల్లో తమ వంశం నిలబడాలంటే ఖచ్చితంగా కనీసం ఒక్క కొడుకైన ఉండాల్సిందే అంటూ కొడుకు పుట్టాలని కోరుకుంటుంటారు. ఇలాగే భావించిన ఓ మహిళ కొడుకు పుట్టాలని చాలా దేవుళ్లకు మొక్కుకుంది. కానీ ఒకరి తర్వాత ఒకరు ఏకంగా ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. దీంతో ఆ మహిళ తీవ్ర మానసిక వేదనకు గురైంది. కొడుకు లేడని ఇరుగు పొరుగు వారు సూటి పోటి మాటలతో హింసించడం చేస్తున్నారు. పైగా అత్తమామలు సైతం వేదించడంతో ఇక తట్టుకోలేకపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు, ఎవరికి చెప్పుకోవాలో తోచ లేదు. వీటన్నిటినీ భరించలేని ఆ వివాహిత ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. తాజాగా బిహార్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచనలంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బక్సర్ లోని గైఝూట్ గ్రామంలో పింకీ దేవి అనే మహిళ నివాసం ఉంటుంది. కొడుకు జన్మించాలని పూజలకు చేసిన ఆ మహిళకు ఒకరి తర్వాత ఒకరు ముగ్గురూ ఆడపిల్లలే జన్మించారు. దీంతో ఆ వివాహిత తీవ్ర మనస్థాపానికి గురైంది. ఏం చేయాలో అర్థంకాక.. ఇటీవల తన ముగ్గురు కూతుళ్లను గొంతు పిసికి హత్య చేసి అక్కడి నుంచి పరారైంది. ఇక మరుసటి రోజు ఉదయం 10 గంటలు దాటిన తన మనవరాళ్లు బయటకు రాకపోవడంతో ఆ మహిళకు అనుమానమొచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా.. ముగ్గురు మనవరాళ్లు చనిపోయి ఉన్నారు. ఈ దారుణాన్ని చూసి చలించిపోయిన ఆ మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా పరారైన తల్లిని కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగింది అని విచారించగా.. నాకు కొడుకులు పుట్టలేదని దీని కారణంగా తీవ్ర మనస్థాపానికి గురయ్యానని, అందుకే నా పిల్లలను హత్య చేసి పారిపోయానని తెలిపింది. ఆ వివాహిత మాటలు విన్న భర్త, అత్తమామలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. కొడుకులు పుట్టలేదని తన ముగ్గురు ఆడపిల్లలను దారుణంగా హత్య చేసిన ఈ తల్లి తీరు ఎంత వరకు సమంజసం? మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: భార్య కోసం ఇద్దరు భర్తల పోరాటం.. మొదటి భర్త హత్యకు రెండవ భర్త ప్లాన్.. అంతలోనే సీన్ రివర్స్!