Crime News: భారీ వర్షాల కారణంగా బెంగళూరు నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. నగరంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో జన జీవనం అస్తవ్యస్తం అయింది. ఈ నేపథ్యంలోనే చాలా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వారం క్రితం అఖిలా అనే యువతి స్కూటీపై వెళుతూ డ్రైనేజీ గుంతలో పడింది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ ఘటన మరువకముందే అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుంది. స్కూటీపై వెళుతూ ఓ యువతి డ్రైనేజీలో పడి మృతి చెందింది. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం రాత్రి బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల తారా బడాయక్ అనే యువతి స్కూటీపై వెళుతోంది. వెనకాల దీలీప్ అనే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. రాత్రి 12.30 గంటల సమయంలో స్కూటీ అశ్వశ్థ్ నగర్లోని కేబీఆర్ లేఅవుట్లోకి వచ్చింది. కొద్దిసేటి తర్వాత స్కూటీ ఉన్నట్టుండి అదుపు తప్పింది. ఆ వెంటనే పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకెళ్లిపోయింది. దీంతో తారా తీవ్రంగా గాయపడింది. బాగా రక్తం స్రావం కూడా అయ్యింది. అధిక రక్తస్రావం కారణంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దిలీప్ కూడా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దిలీప్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తారా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Bengaluru: 23-Year-Old girl electrocuted due to waterlogging and negligence by civic bodies. @harishbijoor speaks to India Today on the issue #ITVideo #BengaluruRains (@PoojaShali) pic.twitter.com/1lorEFNgXz — IndiaToday (@IndiaToday) September 6, 2022 ఇవి కూడా చదవండి : Mulugu Love Couple: పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన యువతి.. విడిచివుండలేక..