అల్లుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని అత్తమామలు కూతురితో పాటు కోరినంత కట్నకానుకలు ఇచ్చారు. అంగరంగ వైభవంగా గ్రామస్తులంతా మెచ్చుకునేలా పెళ్లి చేశారు. కొంత కాలం బాగానే అల్లుడు రోజులు గడిచే కొద్ది డ్రగ్స్ కు బానిసయ్యాడు. దీంతో పాటు అదనపు కట్నం తేవాలంటూ భార్యను రోజూ వేధింపులకు గురిచేసేవాడు. అల్లుడి వేధింపులను భరించలేని అత్తమామలు మరింత డబ్బును ముట్టజెప్పారు. అయినా కూడా సంతృప్తి చెందిన ఆ వ్యక్తి మరింత కట్నం తేవాలనడంతో భార్య తట్టుకోలేకపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి భర్త ఆగడాలను వివరించింది. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటనలో ఇంకా మరెన్నో దారుణలు దాగి ఉన్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుదీప్ అనే యువకుడికి ఓ యువతితో 2021లో పెళ్లి జరిగింది. సుదీప్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడంతో పెళ్లి సమయంలో యువతి తల్లిదండ్రులు రూ.55 లక్షల విలువచేసే మినీ కూపర్ కారు, 200 కిలోల వెండి, 4 కిలోల బంగారు ఆభరణాలను ముట్టచెప్పారు. ఇక పెళ్లైన కొంత కాలం వరకు ఈ భార్యాభర్తలు సంతోషంగానే గడిపారు. ఈ క్రమంలోనే భర్త సుదీప్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. ఇంతటితో ఆగకుండా అదనపు కట్నం కోసం కక్కుర్తిపడి భార్యను వేధింపులకు గురి చేశాడు. అల్లుడు తమ కూతురిని వేధిస్తున్నాడని తెలుసుకున్న అత్తమామలు ఇంకాస్త డబ్బు ఇచ్చారు. అయినా కూడా అతనికి డబ్బుపై వ్యామోహం తగ్గలేదు. బాగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. తన స్నేహితులను ఏకంగా ఇంటికి రప్పించుకుని విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేవాడు. సుదీప్ బాగా మత్తులోకి జారుకున్నాక వికృత చేష్టాలకు పాల్పడేవాడు. భార్యపై మూత్ర విసర్జన చేస్తూ వికృత క్రీడలకు పాల్పడేవాడు. ఇక ఇన్నాళ్లు భరించిన భార్య తట్టుకోలేకపోయింది. భర్త అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడని బెంగుళూరులోని బసవనగుడి మహిళా పోలీసులుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. అదనపు కట్నం తేవాలంటూ వికృత చేష్టలకు పాల్పడుతున్న ఈ దుర్మార్గుడి అరాచకాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: కూతురి హత్యకు తండ్రి మాస్టర్ ప్లాన్! రూ.లక్ష సుపారీ ఇచ్చి!