గతంలో పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. అయినా అధికారులు కనికరించేవారు కాదు. ఆ ఫామ్..ఈ ఫామ్ .. అంటూ నెలలు పొడుగునా తెప్పేవారు. ఒకవేళ, అన్నీ కరెక్ట్ గా ఉన్నా.. అదుంటది.. ఇదుంటది.. వెరిఫికేషన్ అంటూ.. నాలుగు నెలలైనా తిప్పేవారు. ఇదంతా ఒకప్పటి పరిస్థితి. ప్రస్తుతం బ్యాంకింగ్ సేవలు పూర్తిగా మారిపోయాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దాదాపు అన్ని బ్యాంకులు డిజిటల్ పద్దతిలోనే వ్యక్తిగత లోన్ లు మంజూరు చేస్తున్నాయి. ఒక రోజులో కాదు.. ఒక గంటలోనే పర్సనల్ లోన్ ఇస్తున్నాయి. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి 'పీఎస్బీ లోన్ ఇన్ 59 మినిట్స్' అనే వేదికను రూపొందించాయి. దీని ద్వారా మొదట్లో బిజినెస్ లోన్ లు మాత్రమే మంజూరు చేసేవారు. కానీ ఇప్పుడు.. పర్సనల్ లోన్ తో పాటు ముద్రా లోన్, ఆటో లోన్, హోమ్ లోన్ వంటి అన్ని రుణాలు మంజూరు చేస్తున్నారు. 2018 సెప్టెంబర్ 29న ప్రారంభమైన ఈ సేవలను ఇప్పటికే ఎంతో మంది సద్వినియోగం చేసుకున్నారు. పీఎస్బీ లోన్ ఇన్ 59 మినిట్స్ అనే వేదికగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 నాటికి బిజినెస్ లోన్ ల కేటగిరీలో దాదాపుగా 2,01,863 రుణాలు మంజురై రూ.39,580 కోట్లు మంజూరు చేశాయి. రిటైల్ లోన్ కేటగిరీలో చూసుకుంటే గనుక 17,791 రుణాలు మంజూరుకు రూ.1,689 కోట్లు మంజూరు చేయడం విశేషం. మీరు కూడా పర్సనల్, ముద్రా లోన్, బిజినెస్ లోన్, హోం లోన్ లకు అప్లయ్ చేసుకోవాలని అనుకుంటే పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ ప్లాట్ఫామ్లో రుణాలకు అప్లై చేయడానికి https://www.psbloansin59minutes.com/ వెబ్సైట్ ను సంప్రదించండి. పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Get OTP పైన క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నియమ నిబంధనలు కూడా అంగీకరించాలి. మీరు పొందుపరిచిన వివరాలు అన్ని సక్రమంగా ఉన్నట్లయితే.. మీకు రుణం వెంటనే మంజూరు అవుతుంది. ఇది కూడా చదవండి: SBI WhatsApp Banking: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్.. అన్ని వాట్సాప్ లోనే..! ఇది కూడా చదవండి: Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త! ఇకపై ఆ చార్జీలు లేవు