జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని, మబ్బుల చాటున ఆకాశంలో విహరించాలని.. అందరూ కలలు కనడం సహజం. గాల్లో తేలియాడుతూ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండటం వల్ల.. అలా కలలు కనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే, సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి వీట్ జెట్ అనే ఎయిర్లైన్స్ సంస్థ శుభవార్త చెప్పింది. ఎవ్వరూ ఉహించని విధంగా 9 రూపాయలకే విమాన ప్రయాణం అందిస్తామంటూ ముందుకొచ్చింది. అంతర్జాతీయ ఫ్లైట్ టికెట్లపై భారీ తగ్గింపును ప్రకటించిన వీట్ జెట్ సంస్థ ఈ రూ.9 ధరతో భారత్ - వియత్నాం ప్రయాణాన్ని అందించనుంది. భారత్లో 17 కొత్త నగరాలను కలుపుతూ ఫ్లైట్ సేవలను ప్రభించినందుకు గాను ప్రమోషన్ ఆఫర్ కింద ఈ సదవకాశాన్ని కల్పించింది. మొత్తంగా 16,688 టికెట్లను ఇందుకు కేటాయించింది. న్యూఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు నగరాల నుంచి హనోయి, హోచిమిన్ సిటీ, ఫూ క్వోక్ సిటీలకు వెళ్ళే ఫ్లైట్లకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఆగస్టు 15, 2022 నుండి మార్చి 26, 2023 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. వీట్ జెట్.. కొత్త సర్వీసులు 2022 మూడో త్రైమాసికం నుంచి అందుబాటులోకి రావొచ్చు. వారానికి నాలుగు నుంచి ఏడు రిటర్న్ ఫ్లైట్స్ ఉండవచ్చు. ఏదేమైనా లీటర్ పెట్రోల్ 100 రూపాయలు ఉన్న ఈరోజుల్లో 26 రూపాయలకే విమాన ప్రయాణం అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. 'Vietjet' airline to kick off India, Vietnam flights starting from Rs. 9.https://t.co/FS1rGiBzTj pic.twitter.com/togT57Vc8W — NDTV (@ndtv) August 21, 2019 ఇది కూడా చదవండి: SBI WhatsApp Banking: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్.. అన్ని వాట్సాప్ లోనే..! ఇది కూడా చదవండి: నెట్ఫ్లిక్స్ కొత్త రూల్! ఇకపై పాస్వర్డ్ షేరింగ్ కు కూడా డబ్బులు కట్టాల్సిందే!