ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాలే కాదు.. ప్రైవేటు సెక్టార్ లో ఉద్యోగం దొరకడం కూడా కష్టమే. మీలోని నైపుణ్యాలను పెంచుకుంటూ ఉద్యోగంలో ముందుకెళ్తూనే.. మరోవైపు వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయించుకోవాల్సి వస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగులకు వారి సంస్థ నుంచి కూడా ఎంతో తోడ్పాటు అవసరం ఉంటుంది. అయితే తమ ఉద్యోగుల సంక్షేమం కోసం తాము అన్ని విధాల తోడ్పాటు అందిస్తామంటూ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘మీషో’ ముందొక్కించింది. ‘మీ కేర్’ అనే పేరుతో ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మీషో సంస్థ తమ ఉద్యోగుల కోసం అన్ లిమిటెడ్ లీవ్ పాలసీ పేరుతో సరికొత్త సెలవు విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పాలసీలో ఉద్యోగులు గరిష్టంగా 365 రోజుల వరకు సెలవు తీసుకోవచ్చు.. అది కూడా జీతం తీసుకుంటూ. ఈ అన్ లిమిటెడ్ పెయిడ్ లీవ్ పాలసీలో.. ఉద్యోగి లేదా వారి కుటుంబసభ్యులు ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ.. తరచూ చికిత్స అవసరం అయితే వారు ఈ సెలవు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఉద్యోగులు తమ వ్యక్తిగత ప్యాషన్, లక్ష్యాలను సాధించడం కోసం కూడా ఈ అన్ లిమిటెడ్ పెయిడ్ లీవ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనుకోకుండా తమ ఉద్యోగే అనారోగ్యం బారిన పడితే సెలవు కాలం మొత్తం జీతం చెల్లిస్తారు. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్య ఎదురై సెలవు పెడితే 3 నెలల వరకు 25 శాతం జీతం చెల్లిస్తారు. పీఎఫ్, బీమా వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తారు. అయితే అనారోగ్యం కాకుండా మరే కారణాలతో సెలవు తీసుకున్నా ఎలాంటి వేతనం చెల్లించరు. బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్న ఈ మీషో సంస్థలో ప్రస్తుతం 2 వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. చాలా తక్కువ సమయంలోనే ప్రజల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ మీషో సంస్థ.. 1 బిలియన్ డాలర్ల కంపెనీ విలువతో గతేడాది ఏప్రిల్ లో యూనికార్న్ జాబితాలో చేరింది. తమ ఉద్యోగుల కోసం మీషో సంస్థ తీసుకొచ్చిన అన్ లిమిటెడ్ లీవ్ పాలసీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్.. రూ.398కే అన్ లిమిటెడ్ డేటా! ఇదీ చదవండి: ఫోన్ పే బాటలో ‘పేటీఎం’.. రీఛార్జ్ చేస్తే ఎక్సట్రా ఛార్జ్!