చాలా మంది సొంత ఊరిని వదలి సిటీకి వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే కొంత మందికి ఉన్న ఊరిలోనే పని చేసుకుంటూ ఉండాలనిపిస్తుంది. కానీ కొన్ని కారణాల వలన, పరిస్థితుల ప్రభావం వలన నగరాలకు వెళ్లి ఉద్యోంగ చేస్తుంటారు. అలాగే మీకు నగరాలకు వెళ్లి ఉద్యోగం చేయాలన్న ఇంట్రెస్ట్ లేదా? ఉన్న ఊళ్లోనే మంచి ఆదాయం వచ్చే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఐతే మీ కోసం ఓ అద్భుతమైన బిజినెస్ ఆలోచన మీ ముందుకు తీసుకొచ్చాం. తక్కువ పెట్టుబడితో చేసే ఈ వ్యాపారంతో నెలకు రూ.50వేల వరకు సంపాదించవచ్చు. మరి.. ఆ బిజినేస్ ఏంటో, దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. నేటికాలంలో మినరల్ వాటర్ వినియోగం బాగా పెరిగిపోయింది. పంపుల ద్వారా వచ్చే నీటిలో శుభ్రత, రుచి లేకపోవడంతో వీటికి ఆదరణ పెరుగుతోంది. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం వీటి వాడకం పెరిగింది. ఈ క్రమంలో మినరల్ వాటర్ సప్లయ్ బిజినెస్ కూడా ఏటేటా పెరుగుతోంది. ప్రతి ఏటా ఈ వ్యాపారం ఏటా 20% చొప్పున వృద్ధి చెందుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి దిగుతున్నాయి. వాటర్ క్యాన్ల, వాటర్ ప్యాకెట్ల, బాటిళ్ల రూపంలో విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తున్నాయి. ఉన్న ఊర్లోనే మంచి ఆదాయం మార్గలు చూసుకోవాలనుకునే వారికి ఇది ఓ మంచి ఉపాధి. మినరల్ వాటర్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. మొదట కంపెనీని ఏర్పాటు చేయాలి. అనంతరం కంపెనీల చట్టం కింద రిజిస్టేషన్ చేయించుకోవాలి. పాన్ నంబర్, జీఎస్టీ నంబర్ వంటి అన్ని ఫార్మాలిటీలను కంపెనీల చట్టం కింద పూర్తి చేయాలి. అధికారుల నుంచి లైసెన్స్ తీసుకోవాలి. కొందరు పై అనుమతులు ఏమి లేకుండా.. జస్ట్ ఒక బోర్డు పెట్టి నడుపుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. చట్ట ప్రకారం నిర్వహిస్తేనే.. మన్ముందు ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చిన చట్టం అండగా నిలబడుతుంది. వాటర్ ప్లాంట్ కోసం.. బోరు, ఆర్వో ఫిల్టర్తో పాటు పలు యంత్రాలు అవసరం అవుతాయి. వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు టీడీఎస్ స్థాయి ఎక్కువగా లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అప్పుడే నాణ్యమై, స్వచ్ఛమైన వాటర్ని అందించవచ్చు. వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు వాటి వాటి స్థాయిని బట్టీ రూ. 50,000 నుండి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనితో పాటు 20 లీటర్ల సామర్థ్యం ఉన్న 100 వాటర్ క్యాన్లను కొనుగోలు చేయాలి. ఇలా అన్ని ఖర్చులు కలిపి రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. అంత డబ్బు లేనివాళ్లు.. బ్యాంకు నుంచి రుణం కూడా పొందవచ్చు. మీకు 200 మంది కస్టమర్లు ఉడి.. వారికి రోజుకు ఒక క్యాన్ చొప్పున సరఫరా చేస్తున్నారని అనుకుందాం.ఒక వాటర్ క్యాన్ ను రూ.20 నుంచి రూ.25 మధ్య అమ్మినా.. రోజుకు రూ.4000 నుంచి రూ.5000 వస్తాయి. ఆ లెక్కన నెలకు రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం వస్తుంది. ఇందులో కరెంటు బిల్లు, డీజిల్, సిబ్బంది జీతం ఖర్చులు లక్ష రూపాయల వరకు పోయినా.. మీకు రూ.50వేల నికర లాభం వస్తుంది. కస్టమర్లు పెరిగే కొద్దీ.. లాభం కూడా పెరుగుతుంది. ఎండాకాలంలో నీళ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది. అయితే ఈ వ్యాపారం గురించి ఆయా ప్రాంతల పరిస్థితులు, కొన్ని నివేధిక ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఈ వ్యాపారం చేయాలనుకునేవారు దీనిపై లోతైన అధ్యాయనం చేసి, సంబంధిత మార్కెట్ నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. మరి.. మినరట్ వాటర్ బిజినేస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Roadside Assistance: వర్షంలో రోడ్డుపై మీ కారు సడెన్ గా ఆగిపోయిందా? అయితే ఈ ఫ్రీ సర్వీస్ మీ కోసం…