భారత టెలికం రంగంలో ఇప్పటి వరకు అనేక సంచలనాలు చోటు చేసుకున్నాయి. టెలికాం రంగంలో ఇప్పటి వరకు అంబానీ, భారతి మిట్టల్, బిర్లా వంటి ప్రముఖులు ఉన్నారు. జియోతో వచ్చి అంబానీ టెలికాం రంగంలో సృష్టించిన సంచలనం అందరికి తెలిసిందే. తాజాగా ఈ రంగంలో మరో వ్యాపార దిగ్గజం రానున్నారు. అంబానీ, బిర్లాకు పోటీగా అపర కుబేరుడు గౌతమ్ అదానీ సిద్దమవుతున్నారు. త్వరలో నిర్వహించనున్న 5జీ స్పెక్ర్టం వేలంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అదానీ గ్రూప్ సంస్థ స్పెక్ర్టం వేలానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఐదో తరం లేదా అల్ట్రా హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి 5జీ టెలికాం సేవలను అందించగల సామర్థ్యం ఉన్న సంస్థల నుంచి జూలై 26న నిర్వహించే స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి దరఖాస్తులు శుక్రవారంతో ముగిశాయి. నాలుగు అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో మూడు ఇప్పటికే టెలికాం రంగంలో ఉన్న జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియావి కాగా నాలుగోది అదానీ గ్రూప్ అని టాక్. ఈ క్రమంలోనే అదానీ గ్రూపు ఇటీవలనే నేషనల్ లాంగ్ డిస్టెన్స్(NLD), ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్(ILD) లైసెన్స్లు పొందినట్టు తెలుస్తున్నది. అయితే టెలికాం రంగంలోకి అదానీ గ్రూపు ప్రవేశంపై అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం లేదు. దీనిపై ఫోన్కాల్స్కు, ఈమెయిళ్లకు అదానీ సంస్థ నుంచి ఎటువంటి స్పందన రాలేదని పీటీఐ వార్తా సంస్థ పేర్కొన్నది. వేలం నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులకు సంబంధించిన వివరాలను ఈనెల 12న వెల్లడిస్తారు. అప్పుడు మాత్రమే బిడ్డర్లపై అధికారంగా స్పష్టత ఉండే అవకాశం ఉన్నది. ముకేశ్ అంబానీ గౌతం అదానీ ఇప్పటివరకు ఏ వ్యాపారంలో నూ నేరుగా పోటీ పడలేదు. ముకేశ్ అంబానీ చమురు, పెట్రో రసాయనాల వ్యాపార్లోనూ, అదానీ గనులు, నౌక, విమానాశ్రయాలు, విద్యుత్తు పంపిణీ వంటి వ్యాపారాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే, ముకేశ్ అంబానీ టెలికాం-రిటైల్ రంగాల్లోనూ ప్రవేశించారు. ఇప్పుడు అదానీ కూడా టెలికాం రంగంలోకి ప్రవేశిస్తుండడం గమన్హరం. మరి అదానీ టెలికాం రంగంపైలో రానున్నారు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి:Elon Musk: ట్విట్టర్ కొనుగోలుపై ఆశ పెట్టి.. తూచ్ అన్న ఎలన్ మస్క్! ఇదీ చదవండి: KYC updation: KYC పేరుతో కస్టమర్లకు షాకిచ్చిన SBI.. అకౌంట్లు ఫ్రీజ్!