బిగ్ బాస్.. ఈ షో గురించి టాపిక్ రాగానే మొదట గుర్తొచ్చేవి గొడవలు. ప్రేక్షకులందరూ కూడా.. ఏం చూస్తాంలే అని ఫస్ట్ అనుకుంటారు. కానీ మెల్లమెల్లగా షోకి, ఆ గొడవలకు అలవాటు పడిపోతారు. కొన్నిరోజులు కాగానే.. వాటితో పాటు లవ్ ట్రాకులకు అలవాటు పడిపోతారు. చాలా ఆసక్తితో వాటిని చూస్తుంటారు. ఈ సీజన్ లో కూడా అలాంటి ట్రాక్ ఒకటి ఇప్పటికే మొదలైనట్లు కనిపిస్తుంది. బిగ్ బాస్ షోలో లవ్ ట్రాకులు అగగానే మోనాల్-అఖిల్, రాహుల్-పునర్నవి.. ఇలా చెప్పుకుంటే పోతే సీజన్ కి ఒకటైనా ఉంటుంది. అందులో కొన్ని ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తే.. మరికొన్ని కాస్తలో కాస్త అలరిస్తాయి. ఆదివారం బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రారంభం కావడంతో జనాలందరూ కూడా అలాంటి లవ్ ట్రాక్ ఈ సీజన్ ఏమొస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్లకోసమే అన్నట్లు ఓ ట్రాక్ మొదలైనట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో 'క్లాస్-మాస్-ట్రాష్' అని ఫస్ట్ టాస్క్ పెట్టారు. ఈ క్రమంలోనే ఓటింగ్ అంతా ఫైనల్ అయి సూర్య, బాలాదిత్య, శ్రీహాన్... క్లాస్ సభ్యులుగా మారారు. రేవంత్, గలాటా గీతూ, ఇనయా... ట్రాష్ సభ్యులుగా మారారు. ఫస్ట్ ఛాలెంజ్ లో భాగంగా కొబ్బరి బొండాలు ఆట కూడా ఆడారు. ఇనయాపై ఆదిరెడ్డి గెలిచి క్లాస్ లో కొనసాగగా, ఇదే ఆటలో ఓడిన శ్రీహాన్ మాస్ సభ్యుడిగా మారాడు. ఇదంతా జరుగుతున్న టైమ్ లో ఆర్జే సూర్య, 'కార్తీకదీపం' నటి కీర్తిభట్ తో పులిహోర కలిపేందుకు ప్రయత్నిస్తూ కనిపించాడు. కీర్తి వేసుకున్న టీషర్ట్ లాంటిదే తన దగ్గర ఉందని అన్నాడు. మరి వేసుకోవాల్సిందిగా అని కీర్తి అంటే... రేపు వేసుకుంటాను. ఒకవేళ ఎవరైనా అడిగితే నీదే అని చెప్పు అని ఆమెతో అంటాడు. పిచ్చి అని కీర్తిని పిలుస్తాడు సూర్య. ఏమన్నావ్ అని కీర్తి అడగ్గా.. పిచ్చి అని పిలిచా, నాకు అలా పిలవడం ఇష్టమని సూర్య చెబుతాడు. నాకు కూడా ఆ వర్డ్ అంటే చాలా ఇష్టమని కీర్తి తెగ సిగ్గుపడిపోయింది. మొత్తం చూస్తున్న బిగ్ బాస్ ప్రేక్షకుల సూర్య-కీర్తి మధ్య ప్రేమ చిగురించిందా అనేసుకుంటున్నారు. ఈ విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి. ఇదీ చదవండి: ఇనయా సుల్తానా మాటలతో వెక్కి వెక్కి ఏడ్చిన కీర్తీ భట్.. ఎంత ఓదార్చినా..!