కేంద్ర ప్రభుత్వ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పన్నులు వసూలు చేసే సంగతి తెలిసిందే. రాష్ట్రాల నుంచి కేంద్రం జీఎస్టీ రూపంలో పన్నులు వసూలు చేస్తుంది. ఇలా వచ్చిన పన్ను ఆదాయంలో.. కేంద్రం, రాష్ట్రాల వాటాను తిరిగి పంచుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదలలో భాగంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు రెండు విడతల పన్నుల వాటా మొత్తం రూ.1,16,665.75 కోట్లను విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఈ పన్నుల వాటా విడుదలే నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇక కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసిన పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.20,928 కోట్లు విడుదల కాగా... ఆ తర్వాత స్థానంలో నిలిచిన బీహార్కు రూ.11,734 కోట్లు విడుదలయ్యాయి. ఇక ఈ పన్నుల వాటాలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్కు రూ.4,721 కోట్లు, తెలంగాణకు రూ.2,452 కోట్లు విడుదలయ్యాయి. గోవాకు అత్యల్పంగా రూ.450.32 కోట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతవున్న ఏపీకి.. పన్నుల వాటా నిధులు అందడంతో కొంత మేర ఉపశమనం కలిగింది అంటున్నారు అధికారులు. మరి దీనిపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పెన్సిల్, రబ్బరు కూడా ఖరీదయ్యాయి! మోదీకి చిన్నారి లేఖ.. ఇది కూడా చదవండి: GSTతో ఒక్క నెలకే రూ.1,48,995 కోట్ల ఆదాయం ఆర్జించిన కేంద్ర ప్రభుత్వం