నయన్ ప్రైవేట్ పార్ట్స్పై వల్గర్ కామెంట్లు!
హీరోయిన్ నయన తార- దర్శకుడు విఘ్నేష్ శివన్లు జులై నెలలో పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.
దాదాపు 8 ఏళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు.
ఈ సెలెబ్రిటీ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు పిల్లల్ని కన్నారు.
ఇక, అప్పటినుంచి వారిపై ట్రోలింగ్స్ జరుగుతూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే నయన తార ప్రైవేట్ పార్ట్స్పై కామెంట్లు వస్తున్నాయి.
దీనిపై సింగర్ చిన్మయి ఫైర్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా
ఇలా పాడు కామెంట్లు చేసే వారికి ఘాటుగా సమాధానం ఇచ్చారు.
ఈ కామెంట్లు చేస్తున్న మగాళ్లు తల్లి పాలు తాగారా? లేదా? నాకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
వీళ్లకు ఆడ పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.
ఇంట్లో ఉన్న మగవాళ్ల ముందు కూడా దుపట్టా వేసుకోమని
ఓ తల్లి తన కూతురికి చెబుతున్న పరిస్థితి ఉందని అన్నారు
ఈ మగాళ్లు ఇంట్లో ఉన్న ఆడవాళ్లను చూసి కూడా ఇలానే రెచ్చిపోతారా? అని కూడా ప్రశ్నించారు.
నయనతారపై కామెంట్లు చేసిన వారి స్క్రీన్ షాట్లను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.