చలికాలంలో మనకు దొరికే పండ్లలో సీతాఫలం ఒకటి. చాలా అద్భుతమైన రుచి దీని సొంతం.

సీతాఫలంలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఔషద గుణాలు కూడా ఉంటాయి.

సీతాఫలాల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

సీతాఫలాలు తినడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. వీటిని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా సీతాఫలాలకు ఉంది. 

తద్వారా సీజన్ల మార్పుతో వచ్చే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది.

యాంటీ క్యాన్సర్ లక్షణాలను కూడా సీతాఫలంలో ఉంటాయి. 

మలబద్ధకం లాంటి జీర్ణసంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఈ పండు తినడం వల్ల లభిస్తుంది

కంటి చూపు మెరుగుపరచడం, శరీరంలోని వాపులు, నొప్పులని తగ్గించడంలో సీతాఫలం ఎంతగానే ఉపయోగపడుతుంది.

సీతాఫలం గుజ్జులో తేనెని కలిపి తీసుకుంటే మీరు బరువు కూడా పెరుగుతారు. వెయిట్ తక్కువగా ఉన్నవాళ్లకు ఇది ఉపయోగపడుతుంది

సాధారణంగా మగ్గిన సీతాఫలాలను తింటుంటాం. కానీ వాటిని కాల్చి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట.

ఎండు కట్టెలపై సీతాఫలాలను కాల్చడం వల్ల లోపలి గుజ్జు మెత్తగా ఉడుకుతుంది. దీనికి అరగంట నుంచి గంట టైం పడుతుంది.

ఇక కాల్చిన సీతాఫలాలని షుగర్ ఉన్నవాళ్లు కూడా తినొచ్చు. దీని వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

నోట్: పైన చెప్పిన టిప్స్ పాటించే ముందు డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.