నవంబరు 8న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న సంగతి తెలిసిందే.

సూర్య, చంద్రగ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదు అని పెద్దలు చెబుతుంటారు. 

చంద్ర గ్రహణ సమయంలో కూడా ఎలాంటి విధి, విధానాలు పాటించాలో మన పూర్వీకులు సూచించారు.

గ్రహణ సమయం కన్నా కనీసం 3 గంటల ముందు ఘన పదార్థాలు ఏమీ తినకుండా ఉండాలని అంటారు. 

గ్రహణం పట్టినప్పుడు, గ్రహణం వీడినప్పుడు కూడా స్నానం చేయాలి.

ఇల్లు శుభ్రం చేసుకుని, దేవుళ్ళకి పూజ చేసుకోవడం, ఆ తర్వాత వంట చేసుకోవడం చేయలంట.

ఇక గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం ఉంటుంది కాబట్టి ఆహార పదార్థాల మీద గరికలు వేసుకుంటారు. 

చంద్రగ్రహణం రోజున గర్భిణీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటారు. 

నీటి మీద చంద్రుడి ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో 60 శాతం పైనే నీరు ఉంటుంది. 

గర్భస్థ శిశువు తల్లి కడుపులోని ఉమ్మనీటిపై గ్రహణ సమయంలోని కిరణాల ప్రభావం ఉంటుంది.

అలానే గ్రహణం రోజున ఒక పని చేస్తే పేదరికం పోయి ఐశ్వర్యం, రాజభోగ్యం కూడా సిద్ధిస్తాయంట. 

గ్రహణం విడిచి తర్వాత ఇంట్లో లేదా నది వద్ద తల స్నానం చేసొచ్చి.. ఇష్టదైవాన్ని పూజించుకోవాలి.

ముఖ్యంగా చంద్రగ్రహణం రోజున శివుడ్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. 

గ్రహణం విడిచిన తర్వాత శివ పంచాక్షరీ మంత్రం జపిస్తే శుభం కలుగుతుంది.

గ్రహణం ఏర్పడిన 11 రోజుల లోపు శివాలయంలో రుద్రాభిషేకం చేస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. 

బియ్యం, ఉలవలు, వెండి చంద్రబింబం, నాగ పడగలు వంటివి బ్రాహ్మణులకు దానం ఇస్తే మంచిదంట

దానం చేయడం వల్ల గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.