తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో మెగా ప్రాజెక్టును ప్రకటించింది.
తెలంగాణలో త్వరలో మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
తెలంగాణతో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు కానున్నాయని మోడీ చెప్పుకొచ్చారు.
ఈ టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు ద్వారా రూ.వేల కోట్లు పెట్టుబడులు, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని మోడీ అన్నారు.
తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్కు ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని మోడీ పేర్కొన్నారు.
మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి 13 రాష్ట్రాల నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి.
ఆ లిస్టులో నుంచి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్లను కేంద్ర జౌళి శాఖ ఎంపిక చేసింది.
పార్కుల ఏర్పాటుకు సంబంధించి భూముల కేటాయింపు, సింగిల్ విండో అనుమతులు, విద్యుత్తు, నీటి వసతి తదితరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ మెగా పార్కుల ఏర్పాటుకు కనీసం 1,000 ఎకరాల భూమి అవసరం అవుతుందని తెలుస్తోంది.
పీఎం మిత్ర పథకంలో భాగంగా ఏర్పాటు కానున్న ఈ పార్కులకు మద్దతుగా రూ.300 కోట్లు అందించనుంది కేంద్రం.
తెలంగాణకు వచ్చేసరికి.. వరంగల్ లేదా సిరిసిల్లలో ఏదో ఒకచోట మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ పార్కు ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో లక్ష మంది వరకు ఉద్యోగాలు పొందే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇంత మందికి ఉపాధి కల్పించనున్న మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.