అయితే బొప్పాయి పండ్లు మాత్రమే కాక.. ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలా జరిగినప్పుడు.. రోజుకు రెండుసార్లు బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది.
ఈ ఆకుల్లో ఉండే ఎంజైమ్లు ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇలా తేనె కలిపిన బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ సంఖ్య పెరగడంతోపాటు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
బొప్పాయి ఆకుల్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్తో పాటు మన శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు కూడా ఉంటాయి.
తరచుగా ఈ రసాన్ని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి మలబద్దకం సమస్య తగ్గుతుంది.
మరీ ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారు తరచూ బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
బొప్పాయి ఆకుల రసాన్ని ఎక్కువగా తీసుకుంటే వాంతులు, విరేచనాలు, తలతిరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.