ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే (కృష్ణకుమార్కున్నత్) మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోల్కతా న్యూ మార్కెట్ పోలీసులు ఆయన ముఖం, తలపై రంధ్రాలతో కూడిన గాయాలను గుర్తించారు.
ఈ నేపథ్యంలో ‘అసహజ మరణం’గా కేసు నమోదు చేశారు. సింగర్ ఎలా మరణించాడనే దానిపై దర్యాప్తు మొదలుపెట్టారు. గ్రాండ్ హోటల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించనున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్లతో పాటు, హోటల్ స్టాఫ్ను కూడా విచారించనున్నారు.
బుధవారం కేకే మృతదేహానికి కోల్కతాలోని ఎస్ఎస్కేమ్ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరగనుంది. పోస్టుమార్టం నివేదికలో కేకే మరణానికి గల కారణాలు తెలియవచ్చే అవకాశం ఉంది.కాగా, కేకే మంగళవారం ఓ సింగింగ్ ఈవెంట్లో పాల్గొన్నారు. అనంతరం హోటల్ గదికి వెళ్లిన ఆయన అక్కడే కుప్పకూలారు.
ఆయన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు. కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్ గీ తాలను ఆలపించారు.
అడ్వర్టైజ్మెంట్స్లో జింగిల్స్ పాడటం నుంచి ప్రారంభమైన ఆయన కెరీర్ పెద్ద పెద్ద సినిమాలలో పాటల పాడటం వరకు కొనసాగింది. బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వటానికి ముందు 3వేలకు పైగా జింగిల్స్ పాడారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. బెస్ట్ సింగర్గా అన్ని భాషల్లోనూ అవార్డులు గెలుచుకున్నారు. మరి, సింగర్ కేకే మృతిపై వస్తున్న అనుమానాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.