1993 కాలంలో దళిత, ఆదివాసిలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి చిత్ర వధకు గురి చేసిన వాస్తవాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు.
1993 లో కస్టడీలో చంపబడిన భర్త రాజకన్నకు న్యాయం జరగాలంటూ భార్య పార్వతి అమ్మాళ్ చేసిన న్యాయపోరాటం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు జ్ఞానవేల్.
వాస్తవానికి రియల్ కథలో చంపబడిన భర్త రాజకన్న భార్య పార్వతి అమ్మళ్ కు కోర్టులో న్యాయం దక్కినా ఇప్పటికీ కూడా ఆమె ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతోంది.