అయ్యయ్యో వద్దమ్మా అంటూ ఓవర్ నైట్లో సోషల్ మీడియా స్టార్ అయిపోయిన ‘డాన్సర్ శరత్’ అందరికీ తెలుసు.

ఇన్ స్టాగ్రామ్, పేస్ బుక్, మోజ్ ఇలా ఏ సోషల్ మీడియాలో చుసినా అతని డాన్స్ అతని మాటలే వినిపించాయి.

ఓవర్ నైట్ లో ఎంత ఫేమస్ అయిపోయాడు అంటే ఒకప్పుడు నా వీడియోస్ వైరల్ చేయండి అని వేడుకున్న శరత్.. ఇప్పుడు మీమర్స్ అందరికీ అతనొక సబ్జెక్ట్ అయిపోయాడు.

ఇంత ఫేమస్ అయ్యింది మాత్రం అయ్యయ్యో వద్దమ్మా అనే యాడ్ తోనే. కానీ, ఇప్పుడు ఆ యాడే అతనికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది.

శరత్ పై ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిలో డాన్సర్ శరత్ కు   బాగానే గాయాలయ్యాయి. ముక్కు నుంచి రక్తం కూడా వచ్చింది.

ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

హిజ్రాలపై గౌరవం పెరిగేలా ఒక టీపొడి యాడ్ను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ టీ పొడి యాడ్ను మాస్ డాన్సర్ శరత్ రీ మేక్ చేస్తూ తీన్మార్ డాన్సు చేశాడు.

దీంతో హిజ్రాలను కించపరిచాడు అనే భావనతో హిజ్రాలు శరత్ పై దాడి చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

మత సంబంధితమైన వ్యాఖ్యలు చేసినందుకు కూడా శరత్ పై దాడి జరిగిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

జరిగిన దాడిని కొందరు ఎంజాయ్ చేస్తూ మీమ్స్ కూడా చేశారు.

సడెన్ గా అతడు ఫేమస్ అవ్వడం కొందరికి నచ్చకే అలా ట్రోల్ చేస్తున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దాడి చేసింది ఎవరు? ఎందుకు చేశారు అన్న దానిపై క్లారిటీ రాలేదు.

శరత్ పై దాడిని కొందరు సోషల్ మీడియా వేదికగా ఖండించారు.

మరోవైపు దాడి జరిగినట్లు చెప్తున్న వ్యక్తి డాన్సర్ శరత్ కాదనే వాదన కూడా వినిపిస్తోంది.

ఈ విషయంలో అతనే స్వయంగా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.