ప్రముఖ పాటల రచయితగా పేరు      గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి    కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో                 బాధపడుతున్న ఆయన

సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు.

 1986లో సిరివెన్నెల సినిమాలో ఆయన     ప్రస్థానంలో అనేక తెలుగు పాటలు                           రచించారు. 

ముఖ్యంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలకు గాను 11 నంది అవార్డులు రావడం  విశేషం.

1986లో సిరివెన్నెల సినిమాలో ఆయన   రాసిన విధాత తలపున అనే పాటకు  మొట్టమొదటిసారిగా నంది అవార్డును                  దక్కించుకున్నాడు. 

1987 లో వచ్చిన శ్రుతిలయలు సినిమాలోని     తెలవారదేమో స్వామి అనే పాటకు  సైతం నంది అవార్డు వరించడం విశేషం.                    దక్కించుకున్నాడు. 

   దీంతో పాటు 1993లో వచ్చిన గాయం      సినిమాలోని  సురాజ్యమవ్వాలని  స్వరాజ్యమెందుకుని అనే పాటకు కూడా                     అవార్డు లభించింది.

 1994లో వచ్చిన శుభలగ్నం సినిమలోని     చిలక లే తోడు లేక అనే పాటకు కూడా            కూడా ఆయనకు నంది అవార్డు                           వరించింది.

 1996లో వచ్చిన శ్రీకారం మూవీ నుంచి     మనసు కాస్త కలతపడితే అనే పాటకు                సైతం నంది అవార్డు దక్కింది.                         

      ప్రేమకథ-1999లో వచ్చిన దేవుడు      కరుణిస్తాడని అనే పాటకు కూడా నంది                          అవార్డు లభించింది.                          

     2005లో వచ్చిన చక్రం సినిమాలోని     జగమంత కుటుంబం నాది అనే పాటకు        కూడా ఆయనకు నంది అవార్డు                           వరించింది.

       2008లో వచ్చిన గమ్యం మూవీలోని      ఎంత వరకు ఎందు కొరకు అనే పాటకు          కూడా ఆయనకు నంది అవార్డు                           వరించింది.

            చివరి సారిగా 2013లో వచ్చిన       సీతామ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే          సినిమాలోని మరి అంతగా అనే సాగే         పాటకు కూడా నంది అవార్డ వరించింది.

            ఇలా సిరివెన్నెల సీతారామశాస్త్రి             సినీ ప్రస్థానంలో ఉత్తమ పాటల         రచయితగా ఏకంగా 11 నంది అవార్డులు                            రావడం విశేషం.