తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభమైంది.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ఈ రైలు.. మళ్లీ తిరుపతిలో మొదలై సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకుంటుంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి సికింద్రాబాద్ మార్గాల్లో టికెట్ రేట్లలో స్వల్ప వ్యత్యాసం ఉంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఛైర్కార్ టికెట్ రేట్ రూ.1,680గా ఉంది.
సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు రూ.1,270, సికింద్రాబాద్ నుంచి ఒంగోలుకు రూ.1,075, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు రూ.865, సికింద్రాబాద్ నుంచి నల్గొండకు రూ.470గా ధరలను రైల్వే శాఖ నిర్ణయించింది.
ఛైర్కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్కార్కు ఛార్జీల్లో వ్యత్యాసం దాదాపు రెట్టింపుగా ఉంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఎగ్జిక్యూటివ్ ఛైర్కార్ టికెట్ రేటు రూ.3,080గా ఉంది.
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు (20701) టైమింగ్స్ విషయానికొస్తే.. సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 2.30 గంటలకల్లా తిరుపతికి చేరుకుంటుంది.
తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ రైలు (20702) తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి.. రాత్రి 11.45 గంటలకల్లా సికింద్రాబాద్కు చేరుకుంటుంది.
వారంలో ఆరు రోజులు ఈ ట్రైన్ నడుస్తుంది. నిర్వహణ కోసం మంగళవారం ఈ రైలుకు సెలవు ప్రకటించారు.
వందే భారత్ ట్రైన్లో ఆహార పదార్థాల (టిఫిన్, భోజనం)తో పాటు వార్తా పత్రికలను కూడా అందజేస్తారు.
టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే తమకు నచ్చిన ఫుడ్ను ఎంచుకునే వీలును ప్యాసింజర్లకు కల్పించారు.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య టికెట్ బేస్ ఫేర్ను రూ.1,168గా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
క్యాటరింగ్ ఛార్జీ రూ.308గా అధికారులు నిర్ణయించారు. భోజనం వద్దనుకుంటే రూ.1,168కే టికెట్ను కొనుక్కోవచ్చు.