నేటికాలంలో చాలామంది కాస్త  ఎక్కువ పనిచేయగానే అలసిపోతుంటారు.

కొందరు యువతి యువకులు కూడా కాస్తా దూరం నడవగానే అలసిపోతుంటారు.

ఇలాంటి వారందరూ ఓ బామ్మను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 

ఆ బామ్మ 80 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారు. 

ఎవరిపై ఆధారపడకుండా తనపని తానే చేసుకుంటూ పలు రకాల పరుగు పందెలా పోటీలు పాల్గొంటుంది.

ఇటీవలే జరిగిన  'టాటా ముంబాయి మారథన్' పోటీల్లో కూడా ఈ బామ్మ పాల్గొన్నారు.

అలుపు సొలుపు లేకుండా ఐదు కిలోమీటర్లు పరిగెత్తి మారథాన్ ను పూర్తి చేశారు. 

ఆమే మహారాష్ట్ర కు చెందిన 80 ఏళ్ల భారతీ జితేంద్ర పాథక్ అనే బామ్మ.

చీర, స్పోర్ట్స్ షూ ధరించిన ఈ బామ్మ.. జాతీయ జెండాను చేతబట్టి మారథాన్ లో పాల్గొన్నారు.

కేవలం 51 నిమిషాల్లో సుమారు 4.2 కిలోమీటర్లు దూరం ఈ బామ్మ పరిగెత్తారు.  

ఎలాంటి అలుపు లేకుండా సాగినా ఈ బామ్మ పరుగు.. ఇతర పోటీదారుల్లో స్ఫూర్తి నింపింది.  

ఇంత హుషారుగా, ఆరోగ్యంగా ఉండటం వెనుక ఉన్న రహస్యం ఏమిటని కొందరు  బామ్మను అడిగారు. 

రోజూ ఉదయాన్నే కాసేపు నడక, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయడం తనకు అలవాటని ఆమె తెలిపారు.

ఆ వ్యాయామాలనే 80 ఏళ్ల వయసులోనూ తనను ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతున్నాయని అన్నారు.

వయస్సు మీద పడే కొద్దీ చాలా మంది కొన్ని ఆంక్షలు పెట్టుకుంటారని బామ్మ అన్నారు.

తన దృష్టిలో వయసు అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమేన్నారు ఈ బంగారు బామ్మ.